Homeజిల్లా వార్తలుఅఖిల భారత రైతు కూలీ సంఘం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

అఖిల భారత రైతు కూలీ సంఘం వాల్ పోస్టర్ ఆవిష్కరణ

ఇదే నిజం, గూడూరు: అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా జనరల్ కౌన్సిల్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ. స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అఖిలభారత రైతుకూలీ సంఘం ఏఐకేఎంఎస్ మహబూబాబాద్ జిల్లా నాయకులు గజ్జి లింగన్న మాట్లాడుతూ.. దేశానికి అన్నం పెట్టే రైతాంగాన్ని పట్టించుకునే పరిస్థితిలో నేటి ప్రభుత్వాలు లేవనే పరిస్థితిని గమనించాలని, రైతు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరను కేటాయించడం లో చట్టాలు చేసే విధంగా గాని, రైతులకు నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించడంలో ప్రభుత్వాలు తమ బాధ్యతను విస్మరించి, మార్కెట్ వ్యవస్థను కొద్దిమంది వ్యాపార బడా పెట్టుబడిదారి చేతిలో ఉంచి, వ్యవసాయ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరణ కార్పొరేటికరణ చేస్తూ, మల్టీనేషన్ కంపెనీలకు మద్దతుగా నిలుస్తున్న పాలకవర్గ పార్టీలను నిలదీయాలన్నారు. నిత్యం రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తున్న అఖిల భారత రైతు కూలీ సంఘం, జూన్ 26వ తారీఖున మహబూబాద్ జిల్లా కేంద్రంలో, జిల్లాజనరల్ కౌన్సిల్ ను నిర్వహించుకుంటున్నది. కావున ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని, జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు కొట్టెం అచ్చన్న, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈ శ్రీశైలం, జోగ వీరస్వామి,అడూరి. వెంకన్న, కొట్టం వజ్జయ్య, కాడబోయిన నరసయ్య, యాకుబ్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img