Homeవిద్య & ఉద్యోగంఅక్టోబర్ 31 నుంచి అంబేద్కర్ వర్షిటీ మూడో సంవత్సరం పరీక్షలు

అక్టోబర్ 31 నుంచి అంబేద్కర్ వర్షిటీ మూడో సంవత్సరం పరీక్షలు

హైదరాబాద్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ 31-10-2020 నుండి 02-11-2020 వరకు డిగ్రీ మూడో సంవత్సరం ఓల్డ్ బ్యాచ్ పరీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

పరీక్షల నిర్వహణ సమయం మారిందని, ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 1.00 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు, మరియు ప్రభుత్వ ఆదేశాల మేరుకు మూడో సంవత్సరం ఓల్డ్ బ్యాచ్ పరీక్షలు వాయదా వేసిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img