HomeSocial Mediaభారత్ గురించి చైనా పత్రికలో కథనం..

భారత్ గురించి చైనా పత్రికలో కథనం..

చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్‌లో భారత్‌ను గొప్పతనాన్ని ప్రశింసిస్తూ.. ఓ కథనం ప్రచురితమైంది. ఫుడాన్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ సౌతేషియన్ స్టడీస్ డైరెక్టర్ జాంగ్ జియడాంగ్ ఈ కథనాన్ని రాశారు. భారత్ ఎంతో అభివృద్ధి సాధిస్తోందని ఆయన రాశారు. ఆర్థికంగా, అంతర్జాతీయ దౌత్య సంబంధాల పరంగా అభివృద్ధి చెందుతోందని జియాంగ్ అభిప్రాయపడ్డారు. భారత్ నిజంగానే ఓ గ్లోబల్ పవర్ అని, అంతర్జాతీయ దౌత్య సంబంధాల్లో ఓ దేశం ఇంత వేగంగా మార్పులు సంతరించుకోవడం చాలా అరుదని చెప్పారు.

‘‘భారత్ ఆర్థిక రంగంలో ఎంతో పురోగతి సాధించింది. అత్యధిక వృద్ధి సాధిస్తున్న దేశంగా ముందంజలో ఉంది. చైనాతో వాణిజ్య లోటు తగ్గించుకునేందుకు భారత్ ఒకప్పుడు చైనా లక్ష్యంగా వ్యూహాలు రచించేది. ఇప్పుడు ఎగుమతులు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. రాజకీయ, సాంస్కృతిక రంగాల్లోనూ భారత్ వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. పాశ్చాత్య భావనలకు భిన్నంగా తన ప్రజాస్వామ్య మూలాలను భారత్ సగర్వంగా ప్రకటిస్తోంది’’ అని ఆయన అన్నారు.

వలసవాద ముద్ర నుంచి బయటపడి ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచే లక్ష్యంతో భారత్ ముందుకు దూసుకుపోతోందని జాంగ్ వ్యాఖ్యానించారు. దౌత్యవ్యూహంలోనూ భారత్ తీరు విస్పష్టంగా మారిందని అభిప్రాయపడ్డారు. అమెరికా, రష్యా, జపాన్ లాంటి భిన్న ధ్రువాలతో దౌత్యసంబంధాలు బలోపేతం చేసుకునేలా కొత్త వ్యూహాన్ని భారత్ అమలు చేస్తోందన్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ భారత్ తనదైన శైలిలో వ్యవహరించిందని చెప్పారు.

Recent

- Advertisment -spot_img