Homeక్రైంఓవర్​ స్పీడ్​తో లారీని ఢీకొట్టిన ఆటో

ఓవర్​ స్పీడ్​తో లారీని ఢీకొట్టిన ఆటో

– ఏడుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు
– ఇద్దరి పరిస్థితి సీరియస్
– ఏపీలోని వైజాగ్​లో ఘటన

ఇదే నిజం, ఏపీ బ్యూరో: చిన్నారులను స్కూల్​కు తీసుకెళ్తున్న ఆటో లారీని ఢీకొట్టగా.. ఏడుగురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఏపీలోని వైజాగ్​లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ఉదయం వైజాగ్​ రైల్వే స్టేషన్​ నుంచి సిరిపురం వైపు స్కూల్ పిల్లలతో వెళ్తున్న
ఓ ఆటో సంగం శరత్‌ థియేటర్‌ సర్కిల్ వద్ద ఓవర్​స్పీడ్​తో వెళ్లడంతో అదుపుతప్పి లారీని పక్క నుంచి ఢీకొట్టింది. దీంతో ఆటో ఒక్కసారిగా మూడు పల్టీలు కొట్టింది. అందులో ఉన్న ఏడుగురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. రహదారిపై రక్తపు మడుగులో పడి ఉన్న స్టూడెంట్లను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఆటో డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని సీసీ కెమెరా ఫుటేజ్​ను పరిశీలించిన అనంతరం పోలీసులు వెల్లడించారు.


మరో ఘటనలో..


వైజాగ్​లోని మధురవాడ – నగరం పాలెం రోడ్డులో ఆటో బోల్తా పడి విద్యార్థులకు గాయాలయ్యాయి. మధురవాడ నుంచి నగరంపాలెం వైపు వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా.. వారందరూ స్వల్పంగా గాయపడ్డారు.

Recent

- Advertisment -spot_img