Homeహైదరాబాద్latest Newsవిద్యార్థుల మృతి పై విచారణ చేపట్టాలి.. అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే

విద్యార్థుల మృతి పై విచారణ చేపట్టాలి.. అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే

ఇదే నిజం, మెట్ పల్లి రూరల్: జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌతమ్ రెడ్డిని శుక్రవారం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ కలిసి విద్యార్థుల మృతి పట్ల విచారణ చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురై మృతి చెందిన ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన అనిరుద్ అనే విద్యార్థి మృతదేహాన్ని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ మృతి చెందిన ఎల్లారెడ్డిపేట విద్యార్థి అనిరుధ్ కుటుంబానికి మరియు గతంలో ఆరపేట గ్రామానికి చెందిన విద్యార్థి రాజారాపు గణదిత్య కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఇటువంటి సంఘటనలు పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు జరగడం చాలా బాధాకరమని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మెట్ పల్లి ప్రభుత్వ దవాఖాన లో చికిత్స పొందుతున్న విద్యార్థి హేమంత్ ను, నిజామాబాద్ లో చికిత్స పండుతున్న మోక్షిత్ లను కలసి అశ్వస్థత కు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.

Recent

- Advertisment -spot_img