బిహార్ః అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో జనతా దళ్ రాష్ట్రవాదీ పార్టీ తరఫున సింగ్ షియోహర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నశ్రీ నారాయణ్ సింగ్ (45) మృతి చెందాడు.
ఆయుధాలతో వచ్చిన దుండగులు.. మద్దతురాలుగా నటించి ఒక్కసారిగా కాల్పులు జరిపినట్టు షియోహర్ జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ తెలిపాడు.
ఈ ఘటనలో అభ్యర్థితోపాటు మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ చెప్పాడు. మరో మద్దతుదారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఎస్పీ తెలిపారు.
శనివారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందని, నారాయణ్ సింగ్ చాతీ భాగం సహా శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకెళ్లినట్టు ఎస్పీ సంతోష్ వివరించారు.
ఈ ఘటనలో ఎంత మంది నేరస్థులు పాల్గొన్నారనేది స్పష్టత లేదని, ఒకర్ని మాత్రం గ్రామస్థులు పట్టుకున్నారని తెలిపారు. అతడి వద్ద ఓ తుపాకిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ చెప్పారు.
నారాయణ్ సింగ్పై మొత్తం 30 క్రిమినల్ కేసులు ఉన్నాయని, ఆయన కరుడగట్టిన నేరస్థుడని ఎస్పీ అన్నారు.
క్రిమినల్ ముఠాల మధ్య ఉన్న గొడవలే ఈ హత్యకు కారణమని, సింగ్ హత్య వెనుక రాజకీయ కుట్రలేదని ఎస్పీ చెప్పారు.