Homeతెలంగాణటీఎస్ఆర్టీసీకి మరో 80 కొత్త బస్సులు

టీఎస్ఆర్టీసీకి మరో 80 కొత్త బస్సులు

–ప్రారంభించిన మంత్రి పొన్నం

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం టీఎస్ఆర్టీసీకి మరో 80 కొత్త ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు.

కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ పరిరక్షణకు పెద్దపీట వేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారని ఈ సందర్భంగా మంత్రి పొన్నం తెలిపారు. సీసీఎస్‌ బకాయిలు త్వరగా విడుదల చేస్తామని వెల్లడించారు. త్వరలో వెయ్యి ఎలక్ట్రిక్‌ బస్సులు ఆర్టీసీకి అందుబాటులోకి రాబోతున్నన్నట్లు ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img