Homeహైదరాబాద్latest Newsబాన్సువాడలో మరో మహిళ మృతదేహం లభ్యం

బాన్సువాడలో మరో మహిళ మృతదేహం లభ్యం

– వారం రోజుల్లో మూడు శవాలు

ఇదేనిజం, బాన్సువాడ: బాన్సువాడ ప్రాంతంలో వారం రోజుల్లో ఇద్దరు మహిళల,ఒక బాలుడి శవాలు అనుమానాస్పద స్థితిలో లభించాయి. గత వారం పట్టణంలోని వీక్లి మార్కెట్ లో ఓ మహిళ, బాలుడి శవాలు లభించగా, గురువారం( మే 23) నాడు మండలంలోని కృష్ణా నగర్ తాండా వద్ద మరో మహిళ శవం లభించింది. మద్నూర్ మండలం హాన్ డే కెళూర్ గ్రామానికి చెందిన అక్క, తమ్ముడి మృతి మిస్టరీని ఛేదించకముందే, మరో మహిళ హత్య కలకలం రేపుతోంది. ఈ మహిళ ను సైతం గత వారం లొనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రెండు హత్యలకు సంబంధించిన విచారణ శరవేగంగా సాగుతోంది.

బాన్సువాడ మండలం కృష్ణ నగర్ తాండా సమీపంలోని అడవి ప్రాంతంలో లక్ష్మి అనే మహిళ మృత దేహం లభ్యం అయింది. మృతురాలు గాంధారి మండలం బుర్గుల్ గ్రామస్తురాలిగా పోలీసులు గుర్తించారు. వారం క్రితం బాన్సువాడ వారాంతపు సంతలో కూరగాయలు అమ్మి ఇంటికి తిరిగి రాకపోవడంతో గాంధారి పోలీసు స్టేషన్ లో కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయించారు. లక్ష్మి వారపు సంతల్లో కూరగాయలు అమ్మేది అని కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం నాడు అడవిలో శవం లభించింది. ఈ మూడు హత్యలపై ఎస్పీ సీరియస్ గా స్పందించారు. గురువారం ఎస్పీ సింధు శర్మ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. శవం కుళ్లి పోవడంతో సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. హత్యనా? లేక అత్య చారం చేసి హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img