ఏపీలో నిర్వహించనున్న టెట్ పరీక్ష షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఆగస్టు 3 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అక్టోబర్ 3 నుండి 20వ తేదీ వరకు టెట్ పరీక్షల నిర్వహణ ఉంటుంది. నవంబర్ 2న టెట్ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మెగా డీఎస్సీ వేస్తామని వెల్లడించింది.