HomeSocial Mediaఏపీసీసీ చీఫ్ గా వైఎస్​ షర్మిల

ఏపీసీసీ చీఫ్ గా వైఎస్​ షర్మిల

– కాంగ్రెస్​ హైకమాండ్​ ప్రకటన
– తక్షణమే అమల్లోకి నిర్ణయం
– సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజు

ఇదేనిజం, ఏపీ బ్యూరో: ఏపీసీసీ చీఫ్​గా వైఎస్​ షర్మిలను నియమించారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్​ హైకమాండ్​ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పీసీసీ చీఫ్​గా ఉన్న గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. షర్మిలకు ఏపీసీసీ చీఫ్​ గా బాధ్యతలు అప్పగించబోతున్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఆమె ఢిల్లీ వెల్లి కాంగ్రెస్​ పెద్దల సమక్షంలో కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటన విడుదల చేశారు. మరి షర్మిల ఏపీలో తన మార్క్​ ఏ మేరకు చూపిస్తారో వేచి చూడాలి. ఆమె సోదరుడు వైఎస్​ జగన్​ ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు షర్మిల నేరుగా జగన్​ మీద అటాక్​ చేయబోతున్నారు. షర్మిల ఏపీసీసీ చీఫ్​ గా బాధ్యతలు చేపడుతుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా​ మారింది.

Recent

- Advertisment -spot_img