Homeక్రైంగన్​తో కాల్చుకుని Army జవాన్​ సూసైడ్

గన్​తో కాల్చుకుని Army జవాన్​ సూసైడ్

– హైదరాబాద్​లోని లంగర్ హౌస్​లో ఘటన

ఇదే నిజం, హైదరాబాద్: ఆర్మీ జవాన్‌ గన్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం లంగర్‌హౌస్​ పీఎస్ పరిధిలోని ఆర్మీ సెంటర్​లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్‌కు చెందిన రాజిందర్‌ బుధవారం తెల్లవారుజామున తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. జవాన్‌ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Recent

- Advertisment -spot_img