HomeతెలంగాణASSEMBLY: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

ASSEMBLY: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

ASSEMBLY:

శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగనున్నాయి. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే.. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించనున్నది. మాజీ ఎమ్మె ల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్ధన్‌కు సంతాపం అనంతరం సభ వాయిదా పడనున్నది. అనంతరం మండలిలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సభా వ్యవహారాల నిర్వహణ కమిటీ (బీఏసీ) సమావేశం జరగనున్నది.

బీఏసీ సమావేశం

సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలపై బీఏసీలో నిర్ణయించనున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రత్సవాలు సందర్భంగా ఈ నెల 16, 17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి కొనసాగింపుగా మండలి,సభ లో చర్చిస్తారు

Recent

- Advertisment -spot_img