Homeఫ్లాష్ ఫ్లాష్Attack on Women: పట్టపగలే 21 ఏళ్ల విద్యార్థిని కాల్చిచంపిన దుండగులు

Attack on Women: పట్టపగలే 21 ఏళ్ల విద్యార్థిని కాల్చిచంపిన దుండగులు

ఫరీదాబాద్‌: ఫరీదాబాద్‌లోని బల్లబ్‌ గర్ లో అగర్వాల్ కళాశాల బయట సోమవారం నికితా తోమర్ అనే 21 ఏళ్ల విద్యార్థిని పగటిపూట కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టిస్తోంది.

బాధితురాలు గత నెలలో నిందితుల్లో ఒకరైన తౌఫీక్‌పై వేధింపులు, వేధింపుల ఫిర్యాదు చేయడం గమనార్హం.

కారులో వచ్చిన దుండగులు ఆమెపై కాల్పులకు దిగాడు. అతడి నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నించిన నికితపై పాయింట్ బ్లాంక్ లో తుపాకీ పెట్టి కాల్పులు జరిపాడు.

దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. ఆస్పత్రికి తరలించిగా బాధితురాలి చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు.

బాధితురాలిపై కాల్పులు జరిగిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు మొదట బాధితురాలిని ఎత్తుకెళ్లాలని భావించాడు. కానీ ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో చంపేశాడు.

నికితా ప్రస్తుతం బీ. కామ్ చివరి సంవత్సరం చదువుతోంది.

స్థానిక ఏసీపీ జైవీర్ రతి ఈ విషయంపై మాట్లాడుతూ.. నిందితుడు తౌఫీక్ ను సోహ్నాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు చెప్పాడు.

https://twitter.com/i/status/132092617071666380

Recent

- Advertisment -spot_img