Homeహైదరాబాద్latest Newsతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అవినాష్ మహంతి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అవినాష్ మహంతి

– సైబరాబాద్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

– జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి

ఇదేనిజం, శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ ప్రాంగ‌ణంలో తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజ‌రైన అవినాష్ మహంతి, ఐపీఎస్. జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… 2014, జూన్ 2న, అధికారికంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేటితో పదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీస్ శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమానికి జాయింట్ సీపీ ట్రాఫిక్ డి. జోయెల్ డేవీస్, మాదాపూర్ డీసీపీ డా. జి. వినీత్, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు,రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్, మేడ్చల్ డీసీపీ నితికా పంత్,సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ నర్సింహా కొత్తపల్లి, డీసీపీ ఈఓడబ్లు కె. ప్రసాద్, ఉమెన్ ,చైల్డ్ సేఫ్టీ డీసీపీ సృజన కర్ణం, ఎస్‌బి డీసీపీ సాయి శ్రీ, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ డివి శ్రీనివాసరావు, లా అండ్ ఆర్డర్ డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, సిఏఓ అడ్మిన్ గీత, సిఏఓ అకౌంట్స్ చంద్రకళ, ఇన్స్పెక్టర్లు, మినిస్టీరియల్ స్టాఫ్, ఇతర సిబ్బంది హాజరయ్యారు.

Recent

- Advertisment -spot_img