ఇదే నిజం, చేర్యాల టౌన్: చేర్యాల పట్టణంలోని సద్గురు సదనంలో సోమవారం ఎస్సెస్సీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ వక్త మదునూరి శ్రీపాదం విద్యార్థులకు అవగాహన కల్పించారు. భయం పోగొట్టుకొని పరీక్షలను ఎలా ఎదుర్కోవాలో సూచించారు. అనంతరం బాసర సరస్వతి అమ్మవారి వద్ద పూజ చేసిన ప్యాడ్లు, పెన్నులు బహూకరించారు. ఈ కార్యక్రమంలో సద్గురు సదనం సభ్యులు మరుమాముల రామచంద్ర మూర్తి, రామన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.