Homeహైదరాబాద్latest Newsఎండ తీవ్రత నీటి పొదుపు పై అవగాహన సదస్సు

ఎండ తీవ్రత నీటి పొదుపు పై అవగాహన సదస్సు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి భీమ్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు ఈ రోజు ధర్మపురి లోని పలు కూడల్ల లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి వడదెబ్బ నుండి రక్షించుకునేలా అందరు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరియు నీటిని పొదుపుగా వాడుకోవాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాకారులు మహిపాల్, పలిగిరి రాజేందర్, మల్లిక్ తేజ, ప్రవీణ్, అశోక్, రమేష్, సురేష్, ప్రకాష్, పోచయ్య, రాజేశ్వరి, రమ్య పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img