Homeతెలంగాణఅయోధ్య అక్షింతల ఊరేగింపు

అయోధ్య అక్షింతల ఊరేగింపు

ఇదేనిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అక్షింతలను హనుమాన్ దేవస్థానం నుంచి రామాలయం వరకు ఊరేగింపుగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ మండల అధ్యక్షులు అరుణ్ మాట్లాడుతూ జనవరి 1 నుంచి 5వ తేదీలోపు ప్రతి ఇంటికి శ్రీరామ మందిర చిత్రం, ఆహ్వాన పత్రం, అక్షింతల వితరణ కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. ఈ నెల 22న ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అన్ని దేవాలయాల్లో భజనా కార్యక్రమం నిర్వహించాలన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు టీవీలో ప్రత్యక్ష ప్రసారం వస్తుందన్నారు. కార్యక్రమంలో రఘునందన్, ప్రణయ్, నీలకంఠం, సత్యనారాయణ, వెంకటేశ్, సతీశ్, మహిపాల్, లింగబాబు చారి, తిరుమలేష్, నరేశ్, కొమురయ్య, శ్రీను, రాము తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img