Homeజిల్లా వార్తలురోడ్డు ప్రమాదంలో గాయపడిన అయ్యప్ప భక్తుడు మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన అయ్యప్ప భక్తుడు మృతి

ఇదేనిజం, ములుగు : రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ అయ్యప్ప భక్తుడు బుధవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన పలువురు అయ్యప్ప స్వాములు శబరిమలై వెళ్లారు. తిరిగి వస్తుండగా తమిళనాడు రాష్ట్రం మదురై సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గాయపడిన క్షతగాత్రులను మదురై దవాఖానలో చేరారు. చికిత్స పొందుతూ జరుపుల రాము (24) బుధవారం మృతి చెందాడు. ఈ ఘటనలో ములుగు జిల్లాకు చెందిన ముగ్గురు అయ్యప్ప భక్తులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.

Recent

- Advertisment -spot_img