అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో నందమూరి బాలకృష్ణ ఫుల్ స్వింగ్లో ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య తన కెరీర్లో 109వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా జెట్ స్పీడ్లో షూటింగ్ కంప్లీట్ అవుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్పై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం మేకర్స్ ఓ కీలకమైన షెడ్యూల్ను రీసెంట్గా రాజస్థాన్లో ప్లాన్ చేశారు. ఆ షూట్లో బాలయ్య జాయిన్ కానున్నట్లుగా సమాచారం. రాబోయే రోజుల్లో ఈ మూవీ టీమ్ సాలిడ్ అప్డేట్ను అందించేందుకు రెడీ అవుతోంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.