గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న ఎస్పీ బాలు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆయనకు కరోనా నెగెటివ్ రాగా ఇతర ఆరోగ్య సమస్యలను సైతం అధిగమిస్తూ బాలు కోలుకుంటున్నట్లు తెలిపారు ఆయన కుమారుడు. ఇక బాలు కోలుకోవాలని గత కొద్ది కాలంగా అనేక మంది ప్రముఖులు కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. అంతే కాకుండా తమిళనాడులో పలువురు అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.