– జనగామ జిల్లా ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అంజద్ పాషా
ఇదే నిజం, జనగామ : ఈ నెల 23న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనగామ జిల్లా బంద్కు పిలుపునిచ్చినట్లు ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ అంజద్ పాషా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు బస్సు ఫ్రీ సౌకర్యాన్ని కలిపించి ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టిందన్నారు. బంద్ చేపట్టింది పార్టీల కోసం కాదని తమ ఉపాధి చేపట్టిందన్నారు. స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. సమావేశంలో టౌన్ వైస్ ప్రెసిడెంట్, ఆటోయూనియన్ నాయకులు పాల్గొన్నారు.