Homeఫ్లాష్ ఫ్లాష్Bandi sanjay:జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది-బండి సంజయ్

Bandi sanjay:జర్నలిస్టుల పక్షాన బీజేపీ పోరాడుతుంది-బండి సంజయ్

Bandi sanjay:

దాటినా ఎందుకు అమలు చేయడం లేదు? సుప్రీంకోర్టు తీర్పునే కాలరాస్తారా? ఈ స్థలం కోసం ఎదురుచూసి ఇప్పటికే 60 మంది జర్నలిస్టులు నేలరాలిపోయారు. ఇంకెంత మంది చస్తే కనికరిస్తారు?’’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు శుక్రవారం పేట్ బషీరాబాద్ కు విచ్చేసిన బండి సంజయ్ జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టు హౌజింగ్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని సుప్రీంకోర్టు న్యాయవాది, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు హరీష్ రెడ్డి, విక్రమ్ రెడ్డిలతో కలిసి సందర్శించారు. తమకు కేటాయించిన స్థలాన్ని బండి సంజయ్ కు చూపించిన జర్నలిస్టులు ప్రభుత్వం ఆ స్థలాన్ని అప్పగించకపోవడంతో జరుగుతున్న ఆక్రమణలకు చూపించారు.
మరో 5 నెలలు ఆగండి… అధికారంలోకి వచ్చేది బీజేపీ. మా పార్టీ అధికారంలోకి రాగానే ఈ స్థలాన్ని జర్నలిస్టులకు స్వాధీనం చేస్తామని హామీ ఇస్తున్నానని బండి సంజయ్ అన్నాడు . . హైదరాబాద్ సహా తెలంగాణలో ఇళ్లులేక ఎదురుచూస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్లు కట్టించి ఇచ్చే బాధ్యత బీజేపీ తీసుకుంటుందన్నారు జర్నలిస్టులు ఆలోచించండి…. చాట్ల తవుడు పోసి కొట్లాట పెట్టే రకం కేసీఆర్ ది. సీనియర్, జూనియర్ జర్నలిస్టుల పేరుతో మీ మధ్య కొట్లాటపెట్టి ఎవ్వరికీ ఇండ్లు ఇవ్వకుండా 2 వేల కోట్ల విలువైన ఈ స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నడని ఆరోపించారు

Recent

- Advertisment -spot_img