Homeహైదరాబాద్latest Newsసీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: వైద్యాధికారి డా.సతీష్ కుమార్

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: వైద్యాధికారి డా.సతీష్ కుమార్

ఇదేనిజం, లక్షెట్టిపేట: ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మండలం లోని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని బీసీ బాయ్స్ హాస్టల్ లో వైద్య శిభిరం నిర్వహించారు. ఈ వైద్య శిభిరం లో విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించి, జ్వర పీడితుల నుండి రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపి వారికి మందులను అందజేశారు. ఈ శిభిరం లో హెచ్ఈవో లక్ష్మణ్ స్వామి, హాస్టల్ వార్డెన్ పెండెం శ్రీహరి, ఎంఎల్ఎచ్ పీ మౌనిక, హెల్త్ అసిస్టెంట్ లు యం.ఏ. గఫూర్, ఇసాక్ అహ్మద్, ఏఎన్ఎం చిలకమ్మ, ఆశావర్కర్స్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img