టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా ఏడు సార్లు గెలుపొందారు. ఎనిమిదోసారి ఆయన విజయం సాధించడం ఖాయం అని తెలుస్తోంది. మరోవైపు కుప్పంలో చంద్రబాబు మెజార్టీ 40 వేల పైనే ఉంటుందని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో పలువురు వ్యాపారస్తులు రూ.20 కోట్లకుపైగా పందెం కాసినట్లు సమాచారం.