ఇదేనిజం, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఓ బేకరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దాదాపు 15 మంది గాయపడ్డారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం. ఆర్ జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పాడు కరాచీ బేకరీలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో 15 మందికి గాయాలయ్యాయి. వీరిని స్థానికులు, బేకరీలో మిగిలిన సిబ్బంది స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుల్లో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీవో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.