Homeక్రైంBig Breaking​.. పల్లవి ప్రశాంత్​పై కేసు

Big Breaking​.. పల్లవి ప్రశాంత్​పై కేసు

– సుమోటోగా కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్​ పోలీసులు

బిగ్​ బాస్​ సీజన్​ 7లో విజేతగా నిలిచి పల్లవి ప్రశాంత్​ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే అన్న పూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్​ ఫ్యాన్స్​ హంగామా చేశారు. మరో రన్నరప్​ అమర్​ దీప్​ పై దాడి చేశారు. ఇదిలా ఉంటే తాజాగా పల్లవి ప్రశాంత్​పై జూబ్లీహిల్స్​ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం అర్థరాత్రి బిగ్ బాస్ షో వద్ద జరిగిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసుల విచారణ చేపట్టి.. సుమోటోగా కేస్ నమోదు చేశారు. సెక్షన్147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149ల కింద కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన పలువురు అభిమానులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ అనుచరులు చేసిన దాడిలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. 6 ఆర్టీసి బస్సులు, ఓ పోలీస్‌ వాహనం, రెండు ప్రైవేటు వాహనాలు ధ్వంసం అయ్యాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు

Recent

- Advertisment -spot_img