Homeహైదరాబాద్latest NewsBIG BREAKING : మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు…విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై నోటీసులు ఇచ్చిన...

BIG BREAKING : మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు…విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై నోటీసులు ఇచ్చిన పవన్ కమిషన్..

ఇది నిజం, వెబ్ డెస్క్: జస్టిస్ నరసింహారెడ్డి ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై వివరణ ఇవ్వాలని BRS అధినేత కేసీఆర్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 15 లోపు విద్యుత్ ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు. అయితే జులై 30 వరకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కమిషన్ ను కోరారు. నోటీసులపై కేసీఆర్ స్పందన సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత హాజరు ప్రక్రియను ప్రారంభిస్తామని కమిషన్ హెచ్చరించింది.

BRS అధినేత కేసీఆర్ కు పవన్ కమిషన్ నోటీసులు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై విచారణకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను నియమించింది. విద్యుత్‌ కొనుగోళ్ల అంశంపై విచారణ చేపట్టింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాలపై లోటుపాట్ల విచారణలు కమిషన్ కు అప్పగించింది. దీంతో జస్టి నరసింహారెడ్డి… మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారు.

ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై వివరణ

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి పీపీఏలో జరిగిన అవకతవకలను వెలికితీయాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సోమవారం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో మాజీ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.ప్రభాకరరావు, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్‌ చందా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట హాజరయ్యారు.సురేశ్ చందా ఇంధన శాఖలో పనిచేసిన సమయంలో, ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయాలనే వివాదాస్పద ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది.

యాదాద్రి, దామరచర్ల విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కమిషన్ బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనపై కూడా విచారణ జరుగుతోంది.

Recent

- Advertisment -spot_img