ఏపీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈ రోజు తో ముగిసింది. కూటమి అభ్యర్దులకు రెబల్స్ గా నామినేషన్ల దాఖలు చేసిన వారితో బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. టీడీపీ నుంచి సీట్లు ఆశించి దక్కని పలువురు నేతలు రెబల్స్ గా నామినేషన్లు దాఖలు చేసారు. వారితో నామినేషన్లను ఉప సంహించేలా నేతలు ప్రయత్నాలు చేశారు. అవి ఫలించాయి. ఈ క్రమంలోనే నూజీవీడు నియోజకవర్గంలో టీడీపీ రెబల్ అభ్యర్ది ముద్రబోయిన వెంకటేశ్వరరావు సోమవారం నామినేషన్ ని విత్ డ్రా చేసుకున్నారు.