HomeతెలంగాణBig walk tour : సిద్దిపేట టూ శ‌భ‌రిమ‌ల‌.. క‌రోనా క‌ట్ట‌డికై మ‌హాపాద‌యాత్ర‌

Big walk tour : సిద్దిపేట టూ శ‌భ‌రిమ‌ల‌.. క‌రోనా క‌ట్ట‌డికై మ‌హాపాద‌యాత్ర‌

Big walk tour from siddipet to sabarimala for control corona : సిద్దిపేట టూ శ‌భ‌రిమ‌ల‌.. క‌రోనా క‌ట్ట‌డికై స్వాముల మ‌హాపాద‌యాత్ర‌

Big walk tour – లోకకళ్యాణార్థం కై కరోనా మహమ్మారి బారి నుండి ప్రజలు బ‌య‌ట‌ప‌డి సుభిక్షంగా ఉండాలని మ‌హాపాద‌యాత్ర‌కు శ్రీకారం చుట్టారు అయ్య‌ప్ప స్వాములు.

సిద్దిపేటకు చెందిన‌ గురు స్వాములు కొమురవెల్లి వెంకట రమణ గురు స్వామి, బెల్లంకొండ వెంకటస్వామి ,రామచంద్ర రావు స్వామి, ప‌లువురు భ‌క్తుల ఆద్వ‌ర్యంలో ఈ పాద‌యాత్ర‌ను ప్రారంభించారు.

పాద‌యాత్ర‌లో భాగంగా స్వాములు సిద్దిపేట నుంచి శ‌భ‌రిమ‌ల‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు.

ఆదివారం స్థానిక శరభేశ్వర ఆలయంలో మహా పాదయాత్రకు స్వాములు వెళుతున్న సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు .

ఇరుముడులు కట్టుకుని సిద్దిపేట నుండి శబరి కి మహా పాదయాత్ర బయలుదేరిన గురుస్వాములైన శ్రీకాంత్, చందు స్వాములతో కలిసి వెంకటేశ్వర స్వామి ఆలయంలో, నాగ దేవత గుడిలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రకు బయల్దేరిన స్వాములను సాగనంపారు.

ఈ సందర్భంగా స్వాములు శ్రీకాంత్, చందు గురుస్వాములు మాట్లాడుతూ అయ్యప్ప సంకల్పంతోనే మహాపాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాము గౌడ్ స్వామి, రాజు గ్రాఫిక్స్ స్వామి, సాగర్ స్వామి, మల్లికార్జున స్వామి, రమేష్ స్వామి, జ్ఞానేశ్వర్ స్వామి తదితరులు స్వాములు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img