Homeతెలంగాణబీజేపీని పటిష్టం చేసేందుకు.. జిల్లాల ప్యటనకు బండి సంజయ్ శ్రీకారం

బీజేపీని పటిష్టం చేసేందుకు.. జిల్లాల ప్యటనకు బండి సంజయ్ శ్రీకారం

రెండు రోజుల్లో.. ఆరు జిల్లాల ప‌ర్య‌ట‌న‌
హైదరాబాద్: తెలంగాణలో బీజేపీని పటిష్టం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రెండు రోజుల్లో ఆరు జిల్లాలను ప‌ర్య‌టించేలా కార్యాచ‌ర‌ణ రూపొందించారు. రజాకార్ల అరాచకాలు, అకృత్యాలకు గురైన స్థలాలను బండి సంజయ్ సందర్శించే ప్రాంతాల జాబితాలో ఉన్నాయి.
ర్యటన షెడ్యూల్ వివరాలు..
తొలిరోజు ఉదయం 9 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక, రేణికుంటలో పర్యటించనున్నారు. 11 గంటలకు సిద్దిపేట జిల్లాలోని భైరాన్ పల్లి, కూటగళ్లు, ఆకునూరులో పర్యటిస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ రూరల్ జిల్లాలోని పరకాల అమరథామంలో పర్యటిస్తారు. రాత్రికి గోదావరిఖనిలోనే బండి సంజయ్ బస చేయనున్నారు. అలాగే రేపు ఉదయం 11 గంటలకు వరంగల్ రూరల్ జిల్లాలోని జోడేఘాట్‌ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు నిర్మల్‌లోని వేయి ఊడల మర్రి, సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్ జిల్లాలోని ఖిల్లా(దాశరథి జైలు)ను సందర్శిస్తారు.

Recent

- Advertisment -spot_img