బీజేపీ మహిళా నేత మిస్సింగ్ కేసులో ట్విస్ట్
bjp leader: బీజేపీ మహిళా నేత మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. భర్తే ఆమెను హత్యచేసినట్టు తేలింది. నాగ్ పూర్ కు చెందిన బీజేపీ మహిళా నేత సనా ఖాన్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విచారణ జరిపిన పోలీసులు భర్తే హంతకుడని తేల్చారు.
సనా ఖాన్ ఆగస్టు ఒకటిన మధ్యప్రదేశ్లోని జబల్పుర్కు వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఆమె కనిపించలేదు. తన భర్తను కలిసేందుకు ఆమె అక్కడికి వెళ్లిందని కుటుంబసభ్యులు తెలిపారు. జబల్పుర్కు చేరుకున్న తర్వాత సనా తన తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. భర్త అమిత్ సాహును కలిసి రెండు రోజుల్లో తిరిగిరావాల్సి ఉందని వారు తెలిపారు. కానీ ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అని రావడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమిత్ సాహు మద్యం అక్రమరవాణా వ్యాపారం చేస్తుంటాడని, ఓ దాబా నిర్వహిస్తున్నాడని సమాచారం. ఆర్థిక లావాదేవీల విషయంలో సనా, అమిత్ మధ్య కొద్దికాలంగా గొడవలు ఉన్నాయి. ఆమె జబల్పుర్ వచ్చిన సమయంలో కూడా అదే విషయమై వారిద్దరు గొడవపడ్డారని, అది కాస్తా తీవ్ర ఘర్షణకు దారితీయడంతో అమిత్ దాడి చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.