Homeవిచిత్రంబీజేపీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తయ్

బీజేపీ డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తయ్

– కేంద్రమంత్రి, ఆ పార్టీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు వస్తాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈనెల 28న బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఆశించిన పలితాలు రాకపోయినా ఓట్ల శాతం పెరిగిందన్నారు. సీట్లు పెరిగాయన్నారు. 28న జరిగే సమావేశానికి హోంమంత్రి అమిత్ షా వస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలు ఈ మీటింగ్​కు హాజరవుతారన్నారు. 90 రోజుల యాక్షన్ ప్లాన్ ఉందన్నారు. తెలంగాణలోని అన్నివర్గాల్లో బీజేపీకి, మోడీకి సానుకూల చర్చ జరుగుతుందన్నారు. ఎన్నికల కోసం మోడీకి ఓటు వేయడం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. అద్భుత మెజారిటీతో ఎవరు ఊహించని విధంగా మోడీ హ్యాట్రిక్ సాధించబోతున్నారని అన్నారు. 2019తో పోలిస్తే తేడా ఉంది తెలంగాణలోని ప్రతి ఇంట్లో మోడీ చర్చ జరుగుతుందని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నామన్నారు. జనవరి నెలలో పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి పెడతామన్నారు. యువత బీజేపీ వైపు ఉందన్నారు. జనవరి 22 అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ భాగస్వామ్యం కావాలని నిర్ణయించిందని కిషన్ రెడ్డి అన్నారు.

Recent

- Advertisment -spot_img