Home Blog Page 1263

#AP : వ‌ద్దంటున్నా జోరుగా ఏక‌గ్రీవాలు

0

Attempts by the ruling YSR Congress Party to promote consensus in the panchayat elections in the state seem to be yielding some results.

Although all non-YSRCP political parties are opposed to the consensus, its impact at the field level has not been large.

The villagers seem to ignore the statements made by Nimmagadda Ramesh Kumar that they are not promoting consensus.

Consensus was reached at the end of the process of withdrawal of early polling nominations.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు, వేస్తోన్న వ్యూహాలు కొంతమేర ఫలితం ఇస్తున్నట్టే కనిపిస్తోంది.

వైఎస్సార్సీపీయేతర రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తోన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో దాని ప్రభావం పెద్దగా పడట్లేదు.

ఏకగ్రీవాలను తాము ప్రోత్సహించట్లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తోన్న ప్రకటనలను గ్రామస్తులు పట్టించుకోనట్టే.

తొలిదశ పోలింగ్ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేసరికి ఏకగ్రీవాలు తేలాయి.

తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లా, అత్యల్పంగా అనంతపురం జిల్లాల్లో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి.

చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. అనంతపురంలో ఆరుచోట్ల స్థానికులు తమ సర్పంచ్‌ను పోటీ లేకుండా ఎన్నుకున్నారు.

చిత్తూరు జిల్లాలో తొలి విడత మొత్తం 454 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఇందులో 96 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 358 పంచాయతీలకు ఈ నెల 9వ తేదీన పోలింగ్ ఉంటుంది.

రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

తొలి విడత 337 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. 67 ఏకగ్రీవం అయ్యాయి. మూడు రాజధానులను నిరసిస్తూ 400 రోజులకు పైగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతోన్న ఈ జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏకగ్రీవాలు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కడపలో 46, న్యాయ రాజధానిగా ఏర్పాటు కాబోతోన్న కర్నూలు జిల్లాలో 54 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

శ్రీకాకుళం జిల్లాలో 34 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. పశ్చిమగోదావరి-40, విశాఖపట్నం-32, తూర్పు గోదావరి-28, కృష్ణా జిల్లా-20, ప్రకాశం-16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

అనంతపురంలో ఆరు పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. తొలి దశ ఎన్నికల్లో 1,323 నామినేషన్లను తిరస్కరించారు.

రెండో విడత పంచాయతీల నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. రెండో దశలో 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు.

రెండో విడత పోలింగ్ ఈ నెల 13న ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4గంటలకు కౌంటింగ్ చేపడతారు. ఆ వెంటనే ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.

#India : ప్రమాదంలో జర్నలిజం.. ? ఎందుకు.. ?

0

“India is the largest democracy in the world. However, the government does not consider it necessary to comment on such fabrications, “said David Cook, chief of The Christian Science Monitor’s Washington bureau.

“భావ ప్రకటనా స్వేచ్ఛకు భరోసా ఇవ్వలేనప్పుడు ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు’’ అని 2014లో తాను ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందర్భంలోవ్యాఖ్యానించారు.

మోదీ పదవిని చేపట్టి ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. దేశంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ కొరవడి, ప్రజాస్వామ్యం నిజంగానే ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందని చాలామంది భావిస్తున్నారు .

180 దేశాలలో పరిస్థితులను పరిశీలించగా ‘వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్’‌లో భారత్‌కు 142వ స్థానం దక్కింది.

ఇది అంతకు ముందు సంవత్సరం కన్నా ఇంకా రెండు స్థానాలు తక్కువ.

‘రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ అనే సంస్థ ప్రతియేటా భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి ఈ గణాంకాలను విడుదల చేస్తుంది.

ఆరోగ్యకరమైన మీడియా ఉందని చెప్పుకునే దేశానికి ఇది నిజంగా దారుణమైన ర్యాంకు అని చెప్పక తప్పదు.

భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఆందోళన సందర్భంగా జరిగిన హింస తర్వాత మీడియా స్వేచ్ఛకు మరింత ప్రమాదం ఏర్పడినట్లు కనిపిస్తోంది.

రైతుల ఆందోళనల్లో ఒక వ్యక్తి మరణించగా, 500మంది పోలీసులు గాయపడ్డారు.

ఈ ఘటనలపై పలువురి మీద పోలీసులు దేశద్రోహంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో 8మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు.

వీరంతా ఈ ఆందోళనలను కవర్‌ చేశారు.

నిరసనల సందర్భంగా ఒక రైతు ఎందుకు మరణించాడన్నది ఇంకా వివాదాస్పదంగానే ఉంది.

ట్రాక్టర్‌ తిరగబడటం వల్ల ఆ రైతు చనిపోయాడని అధికారులు చెబుతుండగా, పోలీసు కాల్పుల వల్లే మరణించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ ఆరోపణలు వివిధ పత్రికల్లో, టీవీల్లో ప్రముఖంగా వచ్చాయి. అయితే ఈ వార్తను కొందరు జర్నలిస్టులు రిపోర్ట్ చేయడమో పబ్లిష్ చేయడమో చేశారు.

అయితే కొందరు దీన్ని కేవలం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇలా సోషల్ మీడియాలో ఈ వార్తను పోస్ట్‌ చేసిన వారిలో ఆరుగురు జర్నలిస్టులతోపాటు, ఒక కాంగ్రెస్‌ ఎంపీ కూడా ఉన్నారు.

వీరంతా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కేసులు ఎదుర్కొంటున్నారు. తప్పుడు సమాచారం ప్రచారం చేశారన్నది వీరిపై ఉన్న అభియోగం.

“ఒక మృతుడి కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం రిపోర్టుపై అనుమానాలు వ్యక్తం చేయగా, దాని రిపోర్ట్‌ చేయడం నేరం అవుతుందా’’ అని ‘ది వైర్’ ఎడిటర్‌ ఇన్-చీఫ్‌ సిద్ధార్ధ వరదరాజన్ ప్రశ్నించారు.

‘ది వైర్’‌తోపాటు అందులో పనిచేసే ఒక జర్నలిస్టు పైనా కేసు నమోదైంది.

ఈ కేసులపై ఇండియావ్యాప్తంగా హక్కుల ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు. “శాంతియుత ఆందోళనలు చేస్తున్నవారిని ప్రభుత్వం రెచ్చగొడుతోంది.

తనపై విమర్శలు చేసేవారిని, ఈ వార్తలను కవర్‌ చేసేవారిని కేసులతో అణచి వేయాలని చూస్తోంది” అని ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్’ సౌత్ ఏషియా డైరక్టర్‌ మీనాక్షీ గంగూలీ అన్నారు.

పాత్రికేయులపై పెట్టిన కేసులు వారిని వేధించడానికి తప్ప మరొకటి కాదని ‘ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ ఆరోపించింది.

కేసులు ఎదుర్కొంటున్న వారి జాబితాలో ‘కారవాన్‌’ న్యూస్‌ మేగజైన్‌ తరచూ కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుందని ఈ పత్రికకు పేరుంది.

నిరసనకారుల్లో ఒక వ్యక్తి మరణించాడన్న వార్త విషయంలో ఈ మేగజైన్‌కు చెందిన ముగ్గురు సీనియర్‌ జర్నలిస్టులపై ఐదు రాష్ట్రాలలో కేసులు నమోదయ్యాయి.

ఇదే మేగజైన్‌కు సంబంధించిన ఓ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును పోలీసులు ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో అరెస్టు చేసి, రెండు రోజుల తర్వాత విడుదల చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన లీగల్‌ నోటీసుతో ఈ మేగజైన్‌కు చెందిన ట్విటర్‌ ఎకౌంట్‌ను కొన్ని గంటలపాటు సస్పెన్షన్ లో పెట్టారు.

గత ఏడాది దిల్లీ నగరంలో ఒక యువతి అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన నిరసన ప్రదర్శనల సమయంలో ‘కారవాన్‌’ మేగజైన్‌కు చెందిన నలుగురు జర్నలిస్టులపై దాడులు జరిగాయి.

“ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రజల తరఫున ప్రశ్నించడం జర్నలిస్టుల విధి” అని ‘కారవాన్‌’ పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ వినోద్ జోస్‌ అన్నారు.

అధికార పార్టీ ఏమంటోంది?

పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారన్న వాదనను అధికార బీజేపీ తిరస్కరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారంలో ఇది ఒక భాగమని స్పష్టం చేసింది.

“వివిధ పార్టీలతో సంబంధం ఉండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులందరూ తమ తమ పత్రికలు, టీవీలు, వెబ్‌సైట్‌లలో స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారు’’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా అన్నారు.

నిరసనకారులను కుట్రపూరితంగా రెచ్చగొట్టే ప్రయత్నం జరిగినట్లు తేలినందువల్లే జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయని పాండా తెలిపారు.

తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ సీనియర్‌ ఎడిటర్‌ను కొన్నాళ్లు స్క్రీన్‌ మీద కనపడవద్దని యాజమాన్యం ఆదేశించిందని, అలాగే నెల రోజుల వేతనాన్ని కట్‌ చేసిందని పాండా ఈ సందర్భంగా గుర్తు చేశారు.

“ఇదేదో చిన్న తప్పిదం కాదు. ఒక భయంకరమైన విధ్వంసానికి కారణమయ్యే తప్పుడు ప్రచారం.

ఆ జర్నలిస్టు గతంలో కూడా ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తికి ప్రయత్నించారు. బాధితులు కోర్టు వెళ్లడంతో క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అని పాండా అన్నారు.

“మోదీని వ్యతిరేకించే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులపై లేని ప్రేమను నటిస్తున్నాయి.

ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదు’’ అని పాండా అన్నారు.

అయితే ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, మైనారిటీలపై ద్వేషపూరిత వార్తలను ప్రచారం చేసే జర్నలిస్టులు ఇలాంటి కేసుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పించుకోగలుగుతున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వలస పాలకుల కాలంనాటి దేశద్రోహం చట్టాలను ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి మీద ప్రయోగించడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గత దశాబ్ధకాలంగా నమోదైన 405 దేశద్రోహం కేసుల్లో మెజారిటీ కేసులు 2014 తర్వాత, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నమోదైనవేనని ‘ఆర్టికల్ 14’ అనే వెబ్‌సైట్ రూపొందించిన ఒక నివేదిక వెల్లడించింది.

ప్రతిపక్ష నేతలు, విద్యార్ధులు, జర్నలిస్టులు, రచయితలు, మేధావులు ఈ చట్టానికి బాధితులుగా మారారని వెల్లడించింది.

ప్రభుత్వం హక్కులను కాపాడలేదా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో జర్నలిస్టులు గతంకన్నా ఎక్కువ విభజనకు గురయ్యారన్న భావన కనిపిస్తోంది. ప్రధాన మీడియాలో ఎక్కువ సంస్థలు మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయం ఉంది.

“ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడం తమ విధి కాదని ప్రభుత్వం భావిస్తోంది’’ అని ‘ఫ్రీడమ్‌ హౌస్’‌ విడుదల చేసిన ఓ రిపోర్ట్‌ పేర్కొంది.

జర్నలిస్టులు స్వేచ్ఛగా లేరని, 2020 సంవత్సరంలో 67మంది జర్నలిస్టులు అరెస్టయ్యారని, 200మందిపై దాడులు జరిగాయని ‘ఫ్రీస్పీచ్‌ కలెక్టివ్’‌ కోసం నిర్వహించిన ఓ స్టడీలో గీతాశేషు అభిప్రాయపడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువతిపై అత్యాచారం వార్తను కవర్‌ చేసిన జర్నలిస్టు ఒకరు 5 నెలలపాటు జైలులో ఉండాల్సి వచ్చింది.

ప్రభుత్వాన్ని విమర్శించే మహిళా జర్నలిస్టులను ఆన్‌లైన్‌లో అసభ్యకరమైన భాషలో ట్రోలింగ్‌ చేయడం, బెదిరించడం సర్వసాధరణమైంది.

“అత్యాచారం చేస్తామని, చంపుతామని నన్ను నేరుగా బెదిరించారు, ఆన్‌లైన్‌లో అభ్యంతరకర భాషలో ట్రోల్‌ చేశారు” అని దిల్లీకి చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు నేహా దీక్షిత్‌ వెల్లడించారు.

కొందరు తన అపార్ట్‌మెంట్‌లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారని నేహా చెప్పారు.

రోహిణి సింగ్‌ అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును బెదిరించిన కేసులో పోలీసులు ఇటీవలే ఓ విద్యార్ధిని అరెస్టు చేశారు.

అప్రకటిత ఎమర్జెన్సీ

భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించే బలమైన చట్టాలు భారత్‌లో లేవని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వైస్‌డీన్‌ తరునాబ్‌ ఖేతాన్‌ అన్నారు.

భావ ప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం గ్యారంటీ ఇస్తున్నప్పటికీ 1951లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన తొలి సవరణలోనే దానికి పరిమితులు ఏర్పడ్డాయని ఆయన వివరించారు.

తొలి సవరణ నాటి నుంచి భారత ప్రభుత్వం “పౌరుల హక్కుల గురించి చెప్పడం వేరు, వాటిని రక్షించడం వేరు అన్న భావనలోకి వెళ్లింది ’’ అని ‘సిక్స్‌టీన్‌ స్టార్మీ డేస్‌’ అన్న పుస్తకంలో త్రిపుర్‌దమన్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

“పౌర హక్కులను రక్షించడాన్ని ఒక బాధ్యతగాకన్నా ఒక అడ్డంకిగా ప్రభుత్వాలు చూస్తున్నాయి’’ అని ఖేతాన్‌ అన్నారు.

మిగతా ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే ప్రజల హక్కులను రక్షించడంలో సుప్రీంకోర్టు ట్రాక్‌ రికార్డు కూడా దారుణంగా ఉందని ఖేతాన్‌ అభిప్రాయపడ్డారు.

1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంతో 21 నెలలపాటు పత్రికా స్వేచ్ఛ అనేక నిర్బంధాలను ఎదుర్కొంది.

“ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే ఎమర్జెన్సీలాంటి నిర్బంధాలు లేకపోయినా, హక్కులను బహిరంగంగానే హరిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇది ఎక్కడా అధికారికంగా అణచివేత కనిపించదు. కానీ అంతర్లీనంగా సాగిపోతూ ఉంటుంది. ఒకరకంగా మనం అప్రకటిత ఎమర్జెన్సీలో ఉన్నాం’’ అని ఖేతాన్‌ వ్యాఖ్యానించారు.

“మరి కనిపించని ఈ ఎమర్జెన్సీని తొలగించడం ఎలా సాధ్యమవుతుంది’’ అని ఖేతాన్‌ అన్నారు.

#China : అబ్బాయిల్లో ‘మగతనం’ పెంచడానికి ప్రభుత్వం చర్యలు

0

దేశంలోని అబ్బాయిలు మరీ ‘అమ్మాయిల్లా’ తయారవుతున్నారంటూ చైనా విద్యాశాఖ జారీ చేసిన ఒక నోటీసు కలకలం సృష్టిస్తోంది.

చాలా మంది ఆన్‌లైన్ యూజర్లు ఈ నోటీసు మహిళలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తే, మరికొందరు మాత్రం చైనా మేల్ సెలబ్రిటీలు దీనికి కొంత వరకు బాధ్యులని వాదించారు.

దేశంలో అత్యంత పాపులర్ అయిన మేల్ రోల్ మోడల్స్ ‘ఆర్మీ హీరోల్లా’ బలంగా క్రీడాకారుల్లా ఉండడం లేదని చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఫుట్‌బాల్ అభిమాని అయిన అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా తమ దేశంలో మెరుగైన స్పోర్ట్స్ స్టార్లను తయారు చేయాలని చాలాకాలం నుంచీ ప్రయత్నిస్తున్నారు.

దీంతో, చైనా విద్యా శాఖ తమ అంతిమ లక్ష్యం గురించి గత వారం ఒక నోటీస్ జారీ చేసింది.

కౌమారదశలో ఉన్న అబ్బాయిలు మరీ ‘అమ్మాయిల్లా’ తయారవకుండా స్కూళ్లలో వారికి అందించే శారీరక శిక్షణను పూర్తిగా సంస్కరించాలని, ఉపాధ్యాయుల నియామకాలను బలోపేతం చేయాలని ప్రతిపాదించింది.

రిటైర్ అయిన క్రీడాకారులను, క్రీడా నేపథ్యం ఉన్న వారిని కూడా రిక్రూట్ చేసుకోవాలని ఈ నోటీసులో సలహా ఇచ్చారు. విద్యార్థుల్లో ‘మగతనం’ పెంచే ఉద్దేశంతో క్రీడలను, ముఖ్యంగా ఫుట్‌బాల్ లాంటి క్రీడల్లో కఠిన శిక్షణ ఇవ్వాలని సూచించారు.

సున్నితంగా, నాజూకుగా కనిపించే, ‘సామాజిక బాధ్యత’ కలిగిన మేల్ స్టార్లను తప్ప వేరే ఎవరినీ తెరపైకి అనుమతించని మీడియా ఉన్న దేశంలో దీనిని ఒక నిర్ణయాత్మక చర్యగా భావిస్తున్నారు.

కానీ, ఇలాంటి చర్యల తీసుకోబోతున్నట్లు చైనా ఇంతకు ముందే సంకేతాలు ఇచ్చింది.

చైనా యువకుల్లో చాలామంది, బలహీనంగా, పిరికిగా ఉంటున్నారని ఆ దేశ అత్యున్నత సలహా మండలి ప్రతినిధి సీ జెఫూ అన్నారు.

“చైనాలోని యువకుల్లో అమ్మాయిల్లా సుకుమారంగా ఉండే ఒక ట్రెండ్ పెరుగుతోంది. దానిని సమర్థంగా ఎదుర్కోకపోతే చైనా మనుగడ, అభివృద్ధే ప్రమాదంలో పడిపోతుంది. దీనికి కొంత వరకూ ఇంట్లో పెరిగే వాతావరణం కూడా కారణం. చైనా అబ్బాయిలను ఎక్కువగా వాళ్ల తల్లులు, బామ్మలే పెంచుతున్నారు” అని సీ జెఫూ అన్నారు.

దేశంలోని కొంతమంది మేల్ సెలబ్రిటీలను చూసి, కొంతమంది అబ్బాయిలు అసలు ‘ఆర్మీ హీరోలు’ కావాలని కోరుకోవడం లేదని, అందుకే, యువకులకు సమతుల విద్యను అందించడంలో స్కూళ్లు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.

మగాళ్లు ఎందుకు భయపడుతున్నారు

చైనా విద్యా శాఖ నోటీసుపై చాలా మంది చైనీయులు ప్రతికూలంగా స్పందించారు.

కొన్ని లక్షల మంది చైనీయులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ప్రభుత్వం చెబుతున్నది లింగ వివక్షను ప్రోత్సహించేలా ఉందన్నారు.

“సున్నితంగా ఉండడం, ఒక అవమానకరమైన విషయమా” అని ఒక వీబో యూజర్ అడిగాడు. ఆయన కామెంటుకు 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

“అబ్బాయిలు కూడా మనుషులే. భావోద్వేగాలు, బలహీనంగా లేక సున్నితంగా ఉండడం అనేవి మనిషి లక్షణాలు” అని మరో యూజర్ అన్నారు.

“మగవాళ్లు దేనికి భయపడతారు, మహిళలా సమానంగా ఉండడానికా?” అని ఇంకొకరు ప్రశ్నించారు.

దేశంలో మహిళల కంటే ఎక్కువగా 7 కోట్ల మంది మగాళ్లు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి వికృతమైన లైంగిక నిష్పత్తి లేదు. ఇంత ‘మగతనం’ సరిపోదా అని మరో యూజర్ అన్నాడు.

“ఈ ప్రతిపాదనలేవీ మహిళల నుంచి రాలేదు. చైనా అగ్ర నాయకత్వంలో పురుషాధిపత్యం గణనీయంగా ఉందనే విషయాన్ని ఇంతకు ముందే చాలా మంది రాశారు” అని మరొకరు కామెంట్ చేశారు.

కొన్ని మీడియా సంస్థలు మాత్రం ప్రభుత్వ చర్యలకు సానుకూలంగా స్పందించాయి. గ్లోబల్ టైమ్స్ వార్తా పత్రిక ఇది కొంతమంది మద్దతు గెలుచుకుందని రాసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సీనో వీబోలో మేల్ సెలబ్రిటీలను నిందిస్తూ కొందరు కామెంట్లు పెట్టారు. ఈ సెలబ్రిటీలను ఎక్కువగా ‘లిటిల్ ఫ్రెష్ మీట్స్’ అని వర్ణిస్తుంటారు.

చైనాలోని కొందరు మేల్ యూత్ ఐకాన్లను ఉద్దేశిస్తూ ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఈ పదం ఉపయోగిస్తున్నారు. వీళ్లంతా నాజూకుగా, ఆకట్టుకునేలా, చాలా సుకుమారంగా కనిపిస్తుంటారు.

టీఎఫ్ బాయ్స్ అనే అబ్బాయిల బ్యాండ్, చైనా గాయకుడు లూ హాన్ ఇంకా చాలామంది ఈ కేటగిరీలోకి వస్తారు. మరోవైపు యావ్ మింగ్ లాంటి చైనా బాస్కెట్ బాల్ ఆటగాళ్లు అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించారు.

అయితే ప్రభుత్వం తమ ప్రతిపాదనల్లో ముఖ్యంగా ఫుట్‌బాల్ శిక్షణ గురించే చెప్పింది.

ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. 2050 నాటికి చైనా వరల్డ్ ఫుట్‌బాల్ సూపర్ పవర్ అవుతుందని ఆశిస్తున్నట్లు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇంతకు ముందే చెప్పారు.

కానీ, ఫుట్‌బాల్‌లో రాణించాలని చైనా పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అది అసాధ్యమైన లక్ష్యంగా కనిపిస్తోందనే ఎగతాళి కూడా మొదలైంది.

రెండేళ్ల క్రితం చైనా నేషనల్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌ మార్సెల్లో లిప్పీ రిజైన్ చేసినపుడు ఇలాంటి స్పందనలు వచ్చాయి. లిప్పీ 2006 ఫిఫా వరల్డ్ కప్‌ గెలుచుకున్న ఇటలీని లీడ్ చేశారు.

మరోవైపు, దేశంలోని యువకులకు కొత్త రోల్ మోడల్స్‌ను పరిచయం చేయాలని, ప్రమోట్ చేయాలని చైనా కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది.

ఇక చైనాలోని మహిళల విషయానికి వస్తే, కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా మహిళలు గణనీయమైన పాత్ర పోషించారు.

గత ఏడాది చైనా సాధించిన అంతరిక్ష విజయాలు 24 ఏళ్ల స్పేస్ కమాండర్ ఝో చెంగ్యూ లాంటి వారి పేరు వైరల్ అయ్యేలా చేశాయి.

కానీ, చైనా యువకుల్లో సైనికులు, పోలీసులు, ఫైర్ ఫైటర్స్‌ కావాలనే ఆసక్తి తగ్గిపోతోందని సీ జెఫూ గత ఏడాది అన్నారు.

దేశంలో ‘లిటిల్ ఫ్రెష్ మీట్స్’ ట్రెండ్ విజయవంతంగా కొనసాగుతోందని నిరూపితమైంది. కానీ మేల్ యూత్ సెలబ్రిటీలు చాలా నిశిత పరిశీలనలో ఉన్నారు.

ఇటీవల కొంత కాలంగా టాటూలు, ఇయర్ రింగ్స్ వేసుకున్న మేల్ యూత్ ఐకాన్లను స్క్రీన్ మీద చూపించడానికి చైనా మీడియా కూడా ఇబ్బంది పడుతోంది.

చైనా టాప్ పాప్ స్టార్స్‌లో ఒకరు 2019లో బయట సిగరెట్ తాగుతూ కనిపించడంపై కూడా ఆన్‌లైన్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

There is a growing trend among young people in China to be as gentle as girls. China’s survival and development will be in danger if it is not tackled effectively. This is partly due to the growing environment at home. Chinese boys are mostly raised by their mothers and grandmothers

#USA #NASA : కీలక పదవిలో భారతీయ మహిళ

0
The number of Indians increasing in superpower America continues. People of Indian descent impress everyone by ascending to the highest positions in America. Most importantly, the importance of those of Indian descent in the superpower has been growing since Joe Biden was sworn in as the new President of the United States.

అగ్రరాజ్యం అమెరికాలో భారతీయుల హవా కొనసాగుతోంది. భారత సంతతికి చెందిన వ్యక్తులు అమెరికాలో అత్యున్నత పదవులను అధిరోహిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా అమెరికా కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అగ్రరాజ్యంలో భారత సంతంతికి చెందిన వారి ప్రాముఖ్యత పెరుగుతోంది.

ఈ క్రమంలోనే ఇప్పటికే భారతీయులు పలు కీలక పదవులను చేపట్టారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలో మరో భారతసంతతికి చెందిన మహిళ వచ్చి చేరారు.

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ యాక్టింగ్ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా భారత సంతతికి చెందిన భవ్యలాల్‌ సోమవారం నియమితులయ్యారు.

నాసా అంతరిక్ష సాంకేతిక రంగాభివృద్ధి, అమెరికా శాస్త్రీయ, సాంకేతిక విధానాల రూపకల్పనలో భవ్య కీలక పాత్ర పోషించారు.

ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిఫెన్స్‌ అనాలసిస్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీలో 2005 నుంచి 2020 వరకు భవ్యా సభ్యురాలిగా విధులు నిర్వర్తించారు.

#gold #india : తగ్గుతున్న బంగారం ధరలు

0
Gold prices in the country plummeted after the corona virus boom. Fluctuations in prices have continued to plague gold lovers ever since. But recently the central government has reduced the customs duty on gold in the budget. Experts say this will reduce gold and silver prices.

కరోనా వైరస్ విజృంభణ తర్వాత దేశంలో బంగారం ధరలు భగ్గుమన్నాయి.

ఇక అప్పటి నుంచి ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ బంగారం ప్రియులను భయబ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి.

అయితే తాజగా కేంద్ర ప్రభుత్వం లో బడ్జెట్ లో బంగారం పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది.

దీంతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయని నిఫుణులు చెప్పారు.

ఇప్పటికే సోమవారం బంగారం
ధర తగ్గగా వెండి ధర మాత్రం పెరిగింది.

ఈ నేపథ్యంలో మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములు రూ.45,500 ఉంది.

ఒక్క గ్రాము ధర రూ.4,550 ఉంది. ఇక ప్యూర్ గోల్డ్ ధర రూ 320 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములు రూ.49,640లు గా కొనసాగుతుంది.

అయితే ప్రస్తుతం బంగారం కొనవచ్చా అని చాలా మంది భావిస్తున్నారు..

తాజా బడ్జెట్ లెక్కల ప్రకారం బంగారం ధరలు మరింత దిగిరానున్నాయని.. కొన్ని రోజులు ఆగితే మంచిదని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి కోవిడ్ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు జనవరి 6 నుంచి మెల్లగా తగ్గుముఖం పట్టాయి.

జనవరి 6న 22 క్యారెక్ట్స్ బంగారం ధర రూ. 48000 ఉంటే తాజాగా రూ. 45,500 లు ఉంది.

అంటే గత 25 రోజుల్లో దాదాపు రూ.2500 తగ్గింది. ఇంకా తగ్గే అవకాశాలు ఉంటాయి.

అయితే బంగార నగలు కొనుగోలు విపరీతంగా ఉంటె మాత్రం మళ్ళీ బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు.

సౌరవ్ గంగూలీకి మళ్లీ అస్వస్థత.. ఆసుపత్రికి తరలింపు

0

Former TeamIndia captain and BCCI president Sourav Ganguly has fallen ill again. Family members rushed him to the Apollo Hospital in Hutahutina, Kolkata, with reports of chest pain.

టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.

ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటీన కోల్‌కతాలోని అపోలా ఆసుపత్రికి తరలించారు.

మంగ‌ళ‌వారం రాత్రి అనారోగ్యానికి గురైన దాదా.. బుధ‌వారం మ‌ధ్యాహ్నం మ‌రోసారి ఛాతీలో నొప్పి వ‌స్తుంద‌ని చెప్ప‌డంతో వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

ఇటీవల గుండెపోటుకు గురై కోలుకున్న దాదా మళ్లీ ఆసుపత్రిలో చేరారన్న వార్త క్రికెట్‌ అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

సౌరవ్ గంగూలీ అపోలా ఆసుపత్రికి చేరకముందే వైద్య బృందం అతని కోసం సిద్ధంగా ఉందట.

అయితే ఆసుపత్రి లోపలి వెళ్లేందుకు స్ట్రెచర్ లేదా వీల్ చైర్ సహాయం తీసుకోవడానికి దాదా నిరాకరించారని సమాచారం.

దాదా ఆసుపత్రి లోపలికి నడుచుకుంటూ వెళ్లారని తెలుస్తోంది. గంగూలీ ఆరోగ్యం బాగానే ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

మరో రెండు స్టెంట్లు ఇప్పుడు వేసే అవకాశం ఉందని సమాచారం.

జనవరి 2న సౌరవ్ గంగూలీకి గుండెనొప్పి వచ్చింది. ఉదయం ట్రెడ్‌మిల్‌పై పరుగెత్తుండగా వాంతులు, తలనొప్పి, ఛాతినొప్పి వచ్చిందని ఉడ్‌ల్యాండ్‌ ఆస్పత్రిలో చేరారు.

ఆయనను పరీక్షించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో మూడు చోట్ల పూడికలు ఉన్నట్టు గుర్తించారు. ప్రాథమిక యాంజియోప్లాస్టీ చేశారు.

సమస్య తీవ్రంగా ఉన్నచోట స్టంట్‌ వేశారు. ఐదు రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

మిగతా పూడికలను తొలగించేందుకు మరికొన్ని రోజుల తర్వాత యాంజియోప్లాస్టీ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

ఇక‌ పవన్ కళ్యాణ్ కు అండగా చిరంజీవి

0

NadendlaManohar, an active leader of the Janasena party, has officially confirmed that megastar Chiranjeevi is about to step into the party.

At a Janasena active meeting held today, NadendlaManohar said that Chiranjeevi was going to walk along with PawanKalyan soon.

జనసేన పార్టీలోకి మెగాస్టార్ చిరంజీవి అడుగు పెట్టబోతున్నారని అధికారికంగా ఆ పార్టీ క్రియాశీలక నేత నాదెండ్ల మనోహర్ కన్ఫామ్ చేశారు.

ఈరోజు నిర్వహించిన జనసేన క్రియాశీలక సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వెంట త్వరలో చిరంజీవి నడవబోతున్నారని చెప్పారు.

ఈ మేరకు తమ్ముడికి అండగా ఉంటానని చిరంజీవి స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు మనోహర్.

ఈ సమావేశంలో వైసిపీ ప్రభుత్వం పై మనోహర్ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని చెప్పారు.

రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని.. చెప్పారు. అంతేకాదు పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకొండని ప్రభుత్యం బెదిరిస్తుందని ఆయన ఆరోపించారు.

జనసేన ఏకగ్రీవాలకు విరుద్ధమని ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరగాలని అన్నారు.. స్వచ్ఛమైన రాజకీయాల కోసం యువత రావాలంటే.. పంచాయతీ ఎన్నికల్లో యువత నిలవాలని చెప్పారు నాదెండ్ల.

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి అనంతరం ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు.. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పర్యాటక మంత్రిగా పదవిని నిర్వహించారు..

గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి తాజాగా తమ్ముడు పెట్టిన జనసేన పార్టీలో చేరనున్నారని వార్త అటు అభిమానుల్లోనూ ఇటు కార్యకర్తల్లోనూ సంతోషం నింపుతుంది.. ఇప్పటికే నాగబాబు జనసేన పార్ట్ తరఫున ఎంపీ గా పోటీచేసిన సంగతి తెల్సిందే.

బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

0

The country’s highest court has stayed a controversial ruling by the Bombay High Court in a case of sexual harassment of a 12-year-old girl.

Attorney General KK Venugopal has filed a petition in the Supreme Court challenging the Nagpur bench’s verdict amid protests across the country.

Chief Justice SA Babde, who was hearing the case on Wednesday, issued orders suspending the judgment of the High Court.

పన్నెండేళ్ల బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది.

నాగపూర్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పుపై దేశ వ్యాప్తంగా నిరసన స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై బుధవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

వివాదాస్పదంగా మారిన అంశంపై తుది విచారణ ముగిసే వరకు స్టే విధిస్తున్నట్లు తెలిపారు.

బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆందోళనకరంగా ఉందని, దీనిపై మరోసారి సమీక్ష చేయాల్సిన అవసరం ఉందని కేకే వేణుగోపాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా మహారాష్ట్రకు చెందిన 12 ఏళ్ల మైనర్‌ బాలికపై లైంగిక వేధింపుల కేసులో విచారణ జరిపిన జస్టిస్‌ పుష్పా గనేడివాలా ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను దుమారానికి దారితీసింది.

ఈ తీర్పుపై వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు తీర్పుపై ఆందోళన సైతం వ్యక్తం చేశారు.

కేసు పూర్వపరాలు..

39 ఏళ్లు ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలికను పండు ఆశచూపు ఇంట్లోకి తీసుకెళ్లాడు. అనంతరం తలుపులన్నీ మూసి ఆమె ఛాతీభాగాన్ని నొక్కాడు.

అంతేకాకుండా బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కామాంధుడి కోరికను పసిగట్టిన బాలిక పెద్దగా అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతనికి దేహశుద్ధి చేశారు.

బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టం-2012 కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. దిగువ న్యాయస్థానంలో నిందితుడిని ప్రవేశపెట్టారు.

ఐపీసీ సెక్షన్‌ 354 కేసు కింద కూడా అతడిపై మరో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షను విధించింది.

దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును దోషిగా తేలిన వ్యక్తి బాంబే హైకోర్టు నాగపూర్‌ బెంచ్‌లో తీర్పును సవాలు చేస్తూ రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ పుష్ప ఈనెల 19న తుది తీర్పును వెలువరించారు.

ఈ సందర్భంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ‘దుస్తుల పై నుంచి చిన్నారి ఒంటిని తాకినంత మాత్రాన అది పోక్సో చట్టం ప్రకారం నేరంగా పరిగణించలేం.

చర్మాన్ని చర్మం తాకాలి, కానీ ఈ కేసులో అలా జరగలేదు. స్కిన్‌–టు–స్కిన్‌ కాంటాక్టు లేదు. దుస్తుల లోపల చేతులు పెట్టినట్టి కూడా ఆధారాలు లేవు.

పోక్సో చట్టం కింద నమోదైయ్యే కేసుల్లో ఆధారాలు పక్కాగా ఉండాలి’ అని జస్టిస్‌ పుష్ప తన తీర్పు సందర్భంగా పేర్కొన్నారు.

చిన్నారుల ఒంటిని తాకకూడని చోట తాకడం పోక్సో చట్టం కింద నేరం అవుతాయి కనుక, అతడు ఆ పని చేయలేదని ఈ చట్టం ప్రకారం అతడు నిర్దోషే అని తీర్పును వెలువరించారు.

ఐపీసీ సెక్షన్‌ 354 కింద మాత్రమే అతడిని నేరస్థుడిగా గుర్తిస్తామని పేర్కొన్నారు. ఈ తీర్పుపై సినీ నటి తాప్సితో పాటు గాయని చిన్మయి వంటి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రస్తుత సమయంలో ఇలాంటి తీర్పులు రావడం ఆందోళనకరమని అభిప్రాయపడ్డారు. దీనిపై యూత్‌ బార్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ ఇండియా సైతం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది.

మేఘా కృష్ణారెడ్డి ఆస్తుల‌పై జ‌గ్గారెడ్డి ఫైర్‌

0

Megha Krishnareddy, who drives a Maruti car on her own, has earned thousands of crores of rupees in these six years? The head of Rs 30,000 crore has been officially announced.

How is this possible? Megha Krishnareddy’s assets of Rs 30,000 crore out of Rs 3 lakh crore in debt incurred by Telangana government Congress MLA Jaggareddy asked.

‘‘మారుతి కారులో సొంతగా డ్రైవింగ్‌ చేసుకుంటూ తిరిగే మేఘా కృష్ణారెడ్డి ఈ ఆరేళ్లలో రూ.వేల కోట్లు ఎట్లా సంపాదించాడు?  రూ.30 వేల కోట్లకు అధిపతినని అధికారికంగా ప్రకటించారు. ఇది ఎట్లా సాధ్యం?  తెలంగాణ సర్కార్‌ చేసిన మూడు లక్షల కోట్ల అప్పుల్లోనివే మేఘా కృష్ణారెడ్డి 30 వేల కోట్ల ఆస్తులు కావా? ’’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు.

ఆయన అవినీతి గురించి పార్లమెంటులో మాట్లాడాలని కోరుతూ మంగళవారం పార్టీ ఎంపీలను కలిశారు. మేఘా కృష్ణారెడ్డిపై, తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం, మిషన్‌ భగీరథలో చేసిన అక్రమాలపై విచారణకు డిమాండ్‌ చేయాలని సూచించారు.

పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన అంశాలు, ఎజెండాపై ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డిలు సమావేశమయ్యారు.

వారిని కలిసిన అనంతరం జగ్గారెడ్డి నోట్‌ విడుదల చేశారు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి రూ. రెండు లక్షల కోట్ల విలువైన పనులను మేఘా కృష్ణారెడ్డికి ఏకపక్షంగా ఇచ్చిన విషయం నిజం కాదా ? అని ప్రశ్నించారు.

తెలంగాణ డబ్బులతో ఆర్థికంగా బాగా ఎదిగి, ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కృష్ణారెడ్డిని  టార్గెట్‌ చేయకపోతే కాంగ్రెస్​కు పెద్ద ప్రమాదమని, ఆయన టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారని ఆరోపించారు. మేఘా అవినీతి చాలా ఉందనీ, త్వరలో మరిన్ని విషయాలు బయటపెడతానని జగ్గారెడ్డి తెలిపారు.

#H4 #Visa : హెచ్​4 వీసాదారులకు గుడ్ న్యూస్‌

0

There have been criticisms that former US President Donald Trump has always made controversial decisions on immigration policies. Restrictions on H1B visas, which allow foreigners to work in the United States, and restrictions on green cards issued by U.S. citizenship.

వలస విధానాలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడూ వివాదాస్పద నిర్ణయాలనే తీసుకున్నారన్న విమర్శలు ఉండేవి. విదేశీయులకు అమెరికాలో ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పించే హెచ్1బీ వీసాలపై పరిమితి పెట్టడం, అమెరికా పౌరసత్వం ఇచ్చే గ్రీన్ కార్డులపై తిరకాసులు పెట్టడం వంటివి చేశారు.

అంతేకాదు.. హెచ్1బీ వీసాదారుల భార్యలు/భర్తలు ఉద్యోగం చేసుకునే అవకాశం ఇచ్చే హెచ్4 వీసాలపైనా 2019 ఫిబ్రవరిలో ఆయన ఆంక్షలు పెట్టారు. వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా అడ్డుకుంటూ ఉత్తర్వులు పాస్ చేశారు.

అయితే, దాదాపు రెండేళ్ల తర్వాత ఆ ఉత్తర్వులు ఇప్పుడు రద్దయిపోయాయి. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ ట్రంప్ పాస్ చేసిన ఆ ఆదేశాలను నిలిపేశారు. హెచ్4 డిపెండెంట్ స్పౌజెస్ ను ఉద్యోగార్హుల జాబితా నుంచి తీసేస్తూ ట్రంప్ ఇచ్చిన ఉత్తర్వులను ఆఫీస్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ బిజినెస్ (ఓఎంబీ) పరిశీలించింది.

బైడెన్ వచ్చాక వాటన్నింటినీ 60 రోజుల వరకు ఆపేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు లక్ష మంది హెచ్4 వీసాదారులకు లబ్ధి చేకూరనుంది.

ఏంటీ హెచ్4 వీసా?

కేవలం కొన్ని పరిస్థితుల్లో మాత్రమే హెచ్1బీ వీసాదారుల భార్యలు/భర్తలకు హెచ్4 వీసాను ఇస్తారు. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టుకుని ఉండి, అది కన్ఫర్మ్ అవుతుందనుకున్న హెచ్1బీ వీసాదారులు లేదా ఆరేళ్లు లేదా ఆపైన హెచ్1బీ వర్క్ వీసా పొడిగింపు పొందిన వారి భార్యలు/భర్తలకే హెచ్4 వీసాను ఇస్తారు. ఎన్నో ఏళ్లుగా గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వారి కోసం 2015లో నాటి బరాక్ ఒబామా ప్రభుత్వం.. ఈ హెచ్4 ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ (ఈఏడీ)ని తీసుకొచ్చింది.

2017 డిసెంబర్ నాటికి 84,360 మంది భారతీయులు ఈఏడీ ప్రోగ్రామ్ కింద అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. అందులో సింహభాగం భార్యలే ఉన్నారు. అప్పుడు అమెరికా ఆమోదించిన హెచ్4 వీసాల్లో 93 శాతం భారతీయులవే అంటే అతిశయోక్తి కాదు. అయితే, ఇప్పటికి వారి సంఖ్య లక్ష దాటి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.