Home Blog

తెలంగాణ సీఎంగా Revanth Reddy

0

– నిర్ణయం ప్రకటించిన కాంగ్రెస్​ అధిష్ఠానం

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్​ హైకమాండ్​ రేవంత్​ రెడ్డి పేరును ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఢిల్లీలో ప్రకటించారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం రేవంత్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ ఢిల్లీలో ప్రకటించారు. డిసెంబర్‌ 7న ముఖ్యమంత్రిగా రేవంత్​ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధిష్ఠానం నిర్ణయం ప్రకటించడంతో రేవంత్​ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ఇయ్యాల తెలంగాణలో భారీ వానలు

0

– హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడి

ఇదే నిజం, హైదరాబాద్: మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్​తో తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బుధవారం రాష్ట్రంలోని ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే వీలుందని వెల్లడించింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.


వర్షాలపై అధికారుల సమీక్ష..


మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, హనుమకొండ, వరంగల్‌, జనగామ, మహబూబాబాద్‌, సూర్యాపేట జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్షించారు. ‘ బుధవారం భారీ వర్షసూచన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. భద్రాద్రి, ములుగు జిల్లాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపిస్తున్నాం. ఇప్పటికే నిండిన చెరువులకు గండ్లు పడకుండా చర్యలు చేపట్టాలి. లోతట్టు ప్రాంతాల వద్ద జాగ్రత్త చర్యలు తీసుకోవాలి’అని రాహుల్‌ బొజ్జా ఆదేశించారు.

మెదక్ ఎల్లమ్మ ఆలయంలో చోరీ..

0

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, ఆలయాలు అనే తేడా లేకుండా పోతోంది. తాజాగా మెదక్ జిల్లా కొల్చారం మండలం ఎనగండ్లలోని ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరికి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. హుండీలోని డబ్బులతో పాటు, ఇతర సామాగ్రిని కలిపి సుమారు 4 లక్షల రూపాయలకు వరకు ఎత్తుకెళ్లారు. విషం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఆలయంలో నెలరోజుల వ్యవధిలోనే మూడుసార్లు చోరీ జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆరోపించారు.

Chennai Floods : సాయం కోసం హీరో ఎదురుచూపులు

0

– తుఫాన్ దెబ్బకు ఇంటిపైకెక్కిన నటుడు

ఇదేనిజం, నేషనల్​ బ్యూరో : మిచాన్​ తుఫాన్​ దాటికి తమిళనాడు జలమయమైంది. చెన్నై వాతావరణం మొత్తం మారిపోయింది. ఎక్కడ చూసిన వర్షాలు. భారీగా కురుస్తున్న వార్షాలకు చెన్నై నగరమంతా చిగురుటాకులా వణికిపోతుంది. లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోయాయి. ఇప్పటికే ఎనిమిది మందికి పైగా మరణించారని సమాచారం. చాలా ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ కు తీవ్ర అంతరాయం కలిగింది. నగరాలని నీటితో నిండిపోవడంతో రోడ్ల పై ఉన్న కార్లు కూడా నీళ్లలో కొట్టుకుపోయాయి. చాలా మంది నివాసాల్లో నీరు చేరడంతో పాములు వంటి విష ప్రాణులు కూడా వస్తుండటంతో ప్రజలు ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని ఉన్నారు. పలు ప్రధాన నగరాల్లో రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు అధికారులు. చాలా మంది ప్రజలు నీటిలో చిక్కుకుపోయారు. దాంతో జనం పడరాని పట్లు పడుతున్నారు. మరోవైపు ఎన్డీఆర్​ఎఫ్​, ఎస్డీఆర్​ఎఫ్​ బలగాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉంటే కొంతమంది సెలబ్రెటీలు ఆర్ధిక సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ క్రమంలో విష్ణు విశాల్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. విష్ణు విశాల్ కూడా వరదల్లో చిక్కుకున్నారు. కారప్పాకంలోని తమ నివాసంలో నీరు చేరిందని తెలిపాడు. ఇంట్లోకి వరద నీరు రావడంతో ఇంటి పైకి ఎక్కాడు విష్ణు విశాల్. అక్కడి నుంచి ఓ ఫోటోను షేర్ చేశాడు. విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదని.. ఇంట్లోకి నీరు రావడంతో సిగ్నల్ దొరక్క ఇంటి పైకి వచ్చాను అని సిగ్నల్ అందగానే ఈ పోస్ట్​ను షేర్ చేశాను అని తెలిపాడు.

పాక్‌లో మరో ఖలిస్థానీ ఉగ్రవాది మృతి

0

– గుండెపోటుతో చనిపోయిన ఐఎస్​వైఎఫ్​ చీఫ్​ లఖ్​బీర్ సింగ్ రోడే

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో మరో ఖలిస్థానీ ఉగ్రవాది మృతి చెందాడు. ఖలిస్థానీ లిబరేషన్‌ ఫోర్స్‌, ఇంటర్నేషనల్‌ సిఖ్‌ యూత్‌ ఫెడరేషన్‌ (ఐఎస్‌వైఎఫ్‌) సంస్థలకు చీఫ్‌ అయిన లఖ్‌బీర్‌ సింగ్‌ రోడే డిసెంబర్‌ 2న గుండెపోటుతో మరణించాడు. అతడిని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్రవాదిగా ప్రకటించింది. రోడే మరణాన్ని భారత్‌లో ఉంటున్న అతడి సోదరుడు జస్‌బీర్‌ సింగ్‌ ధ్రువీకరించాడు. కెనడాలో ఉంటున్న లఖ్‌బీర్‌ కుమారుడి నుంచి తనకు ఈ సమాచారం అందిందని పేర్కొన్నాడు. పాక్‌లోనే అతడి అంత్యక్రియలను పూర్తిచేసినట్లు వెల్లడించాడు. ఖలిస్థానీ ఉగ్రవాది భింద్రన్‌వాలేకు లఖ్‌బీర్‌ సమీప బంధువు. ఇటీవల అతడికి చెందిన భూమిని స్వాధీనం చేసుకోవాలని మొహాలీలోని ఎన్‌ఐఏ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. 2021లో ఫాజిల్కా జిల్లా జలాలబాద్‌లోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి ఇతడిపై కేసు నమోదైంది.

1984లో ప్రారంభమైన ఐఎస్‌వైఎఫ్‌ సంస్థ కెనడా, యూకేలో చురుగ్గా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అమెరికా విదేశాంగశాఖ దీనిని ఉగ్రసంస్థగా ప్రకటించింది. 2002లో పోటా చట్టం కింద భారత్‌ దీనిపై నిషేధం విధించింది. ఉగ్రసంస్థ లష్కరేతో దీనికి సంబంధాలున్నాయి. చాలా దేశాలు దీనిపై నిషేధం విధించడంతో సిఖ్‌ ఫెడరేషన్‌గా పేరు మార్చుకొంది. పంజాబ్‌లో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించేందుకు రోడే పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐతో కలిసి పనిచేశాడు. గతంలో పంజాబ్‌లో చోటు చేసుకొన్న పలు టిఫిన్‌ బాంబు ఘటనల్లో రోడే హస్తం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పంజాబ్‌లో స్వాధీనం చేసుకున్న ఆర్డీఎక్స్‌, టిఫిన్‌ బాంబులకు సంబంధించిన కేసులో ఇతడి సోదరుడు జస్‌బీర్‌ సింగ్‌ను కూడా గతంలో పోలీసులు అరెస్టు చేశారు. 2020లో శౌర్యచక్ర గ్రహీత బల్వీందర్‌ సింగ్‌ హత్య లఖ్‌బీర్‌ సూచనలతోనే జరిగింది. పంజాబ్‌లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదక ద్రవ్యాలను చేరవేస్తున్నరని రాష్ట్ర స్పెషల్‌ ఆపరేషన్‌ సెల్‌ ఈ ఏడాది రోడేతో పాటు మరో ఎనిమిది మందిపై కేసులు నమోదు చేసింది. ఇక పాక్‌లో నక్కిన చాలా మంది ఉగ్రవాదులు ఇటీవల హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. మే నెలలో ఖలిస్థానీ కమాండో ఫోర్స్‌ అధినేత పరంజీత్‌ సింగ్‌ పన్వార్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లాహోర్‌లో కాల్చిచంపారు

చంద్రయాన్​–3లో కీలక ప్రయోగం

0

– చంద్రుడి కక్ష్యలోకి పరికరాలను వెనక్కి తేవడంపై ఫోకస్ పెట్టిన ఇస్రో

ఇదే నిజం, నేషనల్​ బ్యూరో: చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా భారత అంతరిక్ష సంస్థ ఇస్రో మరో కీలక ప్రయోగాన్ని విజయవంతంగా మొదలుపెట్టింది. చంద్రుడి కక్ష్యలోకి పరికరాలను పంపిన ఇస్రో.. ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకురావడంపై ఫోకస్ పెట్టింది. ఇటీవల చంద్రయాన్‌-3లో భాగంగా ప్రయోగించిన ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ను తాజాగా జాబిల్లి కక్ష్య నుంచి తిరిగి భూకక్ష్య వైపు మళ్లించినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్ట్​ అనుకున్న దాని కంటే అధిక ఫలితాలను భారత్‌కు అందించినట్లైంది. తాజాగా దీనికి సంబంధించిన సమాచారాన్నిమంగళవారం ఇస్రో ట్వీట్‌ చేసింది. కక్ష్య పొడిగింపు, ట్రాన్స్‌ ఎర్త్‌ ఇంజెక్షన్‌ విన్యాసాలతో దీన్ని పూర్తిచేసినట్లు వెల్లడించింది. భారత్‌ ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ మార్గాన్ని తెలివిగా ప్లాన్‌ చేయడంతో.. దాదాపు 100 కిలోల ఇంధనం దీనిలో మిగిలింది.

దీనిని వాడుకొని మరికొన్ని పరిశోధనలు పూర్తిచేశారు. అనంతరం చంద్రుడి కక్ష్య నుంచి దీని మార్గాన్ని భూకక్ష్య వైపు మళ్లించారు. దీనిపై ఉన్న షేప్ పేలోడ్‌ భూమిపై పరిశోధనలు నిర్వహించనుంది. ఇది 36,000 కిలోమీటర్ల ఎత్తులో భూమి జియో బెల్ట్‌లోకి ప్రవేశించే సమయంలో, దిగువ కక్ష్యలోకి వచ్చే సమయంలో ఉపగ్రహాలను ఢీకొనకుండా అక్టోబర్‌లోనే పక్కగా ప్లాన్‌ చేశారు. చంద్రయాన్‌-3లోని మూడు ప్రధాన భాగాల్లో ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ కూడా ఒకటి. ఇది కాకుండా ల్యాండర్‌ మాడ్యుల్‌, రోవర్‌ ఉన్నాయి. ఇక ప్రొపల్షన్‌ మాడ్యుల్‌తో ల్యాండర్‌ మాడ్యుల్‌ అనుసంధానమై ఉంటుంది. ఇది వాహకనౌక నుంచి విడిపోయి, ల్యాండర్‌ మాడ్యుల్‌ను చంద్రుడికి 100 కి.మీ. సమీపం వరకు తీసుకెళ్లింది. ఆ తర్వాత ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యుల్‌ విడిపోయింది. ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ కొన్ని నెలల పాటు కక్ష్యలోనే ఉంది. దీనిలోని పరికరం సాయంతో సమాచారాన్ని సేకరించి సైంటిస్టులకు పంపింది.

రష్యాతో భారత్​ది 60 ఏళ్ల నాటి బంధం

0

– ఆ మైత్రినే ఎన్నోసార్లు కాపాడింది
– కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: భారత్‌ – రష్యా మధ్య ఏళ్ల నాటి మైత్రి ఉందని.. అది అకస్మాత్తుగా ఏర్పడింది కాదని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ అన్నారు. దానివల్ల ఢిల్లీకి నష్టం కలిగిందనే భావన సరికాదని వ్యాఖ్యానించారు.‘మనకు రష్యాతో సంబంధం ఉంది. ఆ బంధం ఒక్క రోజులో ఏర్పడింది కాదు. అది 60 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ 50-60 ఏళ్లకాలంలో ప్రపంచ రాజకీయ గమనం.. ఆ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు ఉపకరించింది. రష్యాతో స్నేహం వల్ల ఢిల్లీకి నష్టం జరిగిందనే భావన సరికాదు. ఆ బంధమే ఎన్నోసార్లు కాపాడింది’అని మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది ప్రారంభం నుంచి ఉక్రెయిన్‌ – రష్యా మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం విషయంలో ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకొని భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. సార్వభౌమత్వం, దేశ ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చింది. చర్చల ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారం కనుగొనాలని సూచించింది. ఈ నేపథ్యంలో జై శంకర్ చేసిన వ్యాఖ్యలు వెస్ట్రన్ కంట్రీస్​కు కాస్త మింగుడుపడవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

వెంకీతో నాని చిట్​ చాట్

0

నేచురల్ స్టార్ నాని హీరోగా, డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్​ గుడ్ రొమాంటిక్ మూవీ హాయ్ నాన్న. ఈ నెల 7న వరల్డ్​ వైడ్​గా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషన్లకు ఆడియెన్స్​ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాపై మంచి హైప్ కూడా వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఆడియెన్స్​కు వెల్లడించేందుకు రెడీ అయిపోయారు నాని.తాజాగా సీనియర్ హీరో వెంకటేశ్​తో చిట్ చాట్ వీడియోను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే, వెంకీ షేర్ చేసిన పోస్ట్ పై నాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మనం ఒకరిని చూస్తూ ఎదిగిన వాళ్లతో కూర్చొని మాట్లాడటం డిఫరెంట్ ఫీలింగ్ అని అన్నారు. హాయ్ నాన్న మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్​గా నటించగా, హేషం అబ్ధుల్ వహాబ్ మ్యూజిక్ అందించారు.

ఫన్​ అండ్ ప్రామిసింగ్​గా ‘డంకీ’ ట్రైలర్

0

‘పఠాన్’,‘జవాన్’సినిమాలతో ఈ ఏడాది బ్యాక్​ టు బ్యాక్​ హిట్లు కొట్టిన బాలీవుడ్​ బాద్ షా షారుఖ్​ ఖాన్ హ్యాట్రిక్​పై కన్నేశాడు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘డంకీ’ రిలీజ్​కు సిద్ధంగా ఉంది. బాలీవుడ్ టాప్​ డైరెక్టర్ రాజ్​కుమార్​ హిరానీ తెరకెక్కించిన డన్కీ సినిమాపై మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఫన్ ప్రోమోస్, పాటలతో ప్రమోట్​ చేస్తూ వచ్చిన మేకర్స్ తాజాగా సినిమా ట్రైలర్​ను మంగళవారం రిలీజ్ చేశారు. నవ్వులతో పాటు భావోద్వేగాన్ని పంచుతోన్న ఈ ట్రైలర్‌ చూసి సినీ లవర్స్​ ఖుష్‌ అవుతున్నారు. తాజాగా దీనిపై షారుఖ్​ ట్వీట్‌ చేశారు. ట్రైలర్‌ను సోషల్‌ మీడియాలో పంచుకున్న బాద్‌ షా.. ‘రాజ్‌ కుమార్‌ హిరానీ విజన్‌ నుంచి ఈ కథ నాతో మొదలవుతుంది. నా ఫ్రెండ్స్‌తో కలిసి నేను దీన్ని ముగిస్తాను. స్నేహం, కామెడీ, విషాదం.. ఇలా ఎన్నో ఎమోషన్స్‌ ఇందులో ఉన్నాయి. ఇది చూసిన ప్రతి ఒక్కరికీ వాళ్ల కుటుంబంతో ముడిపడిన జ్ఞాపకాలు గుర్తొస్తాయి.

అందరి ఎదురుచూపులు ఫలించాయి. ట్రైలర్‌ను చూసి ఆనందించండి’అని రాశారు. ఇక షారుఖ్​ చెప్పినట్లే ట్రైలర్ ఉంది. వినోదంతో మొదలైన ఈ ట్రైలర్‌లో ఎన్నో భావోద్వేగాలను చూపించారు. చివరలో షారుఖ్​ను ఓల్డ్ ఏజ్ మ్యాన్​గా చూపించి ముగించారు. ఇప్పటి వరకు సినిమాపై ఉన్న అంచనాలను ఈ ట్రైలర్‌ రెట్టింపు చేసింది. ఇక ప్రస్తుతం ‘డంకీ’ హ్యాష్‌ట్యాగ్‌ సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అలాగే దీని అర్థాన్ని కూడా నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. దీని గురించి గతంలోనే షారుఖ్​, రాజ్‌ కుమార్‌ హిరానీ వివరించారు. ‘డంకీ’ అంటే మరోదేశంలోకి అక్రమంగా చొరబడడం అని.. భారత్‌ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించాలని ప్రయత్నించే నలుగురు స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంటుందని ఓ ఇంటర్వ్యూలో షారుఖ్​ చెప్పారు. భారీ అంచనాల మధ్య డన్కీ సినిమా ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాప్సీ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ ఫిల్మ్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.

‘ఎక్స్ ట్రా..ఆర్డినరీ మ్యాన్​’పై నితిన్​ ఫుల్ కాన్ఫిడెన్స్..

0

‘జయం’మూవీతో కెరీర్​ ప్రారంభించిన టాలీవుడ్​ హీరో నితిన్​కు​ స్టార్టింగ్​లో ‘దిల్’​,‘సై’లాంటి సూపర్​హిట్లు పడ్డప్పటికీ ఆ తర్వాత వరుస ఫ్లాప్​లతో వెనకపడిపోయాడు. మళ్లీ 2012లో వచ్చిన ఇష్క్​, ఆ తర్వాత ఏడాది రిలీజైన గుండెజారి గల్లంతయిందే సినిమాలతో బౌన్స్ బ్యాక్​ అయ్యాడు. అయితే, కెరీర్​ మొత్తంలో ఫ్లాప్​లు ఎక్కువున్నప్పటికీ రెండేళ్లకోసారి హిట్లు కొడుతూ టాలీవుడ్​లో తన స్థానాన్ని నితిన్ సుస్థిరం చేసుకున్నాడు. కరోనాకు ముందు రిలీజైన భీష్మ సినిమాతో మళ్లీ ట్రాక్​లోకి వచ్చిన నితిన్​ను ఆ తర్వాత వరుస పరాజాయాలు పల​కరించాయి. ఈసారి మళ్లీ ఎలాగైన హిట్టు కొట్టి బ్యాక్​ టు ఫామ్​లోకి రావాలని నితిన్​ గట్టిగా ట్రై చేస్తున్నాడు. తాజాగా అతడు నటించిన ‘ఎక్స్​ట్రా.. ఆర్డినరీ మ్యాన్’మూవీ రిలీజ్​కు సిద్ధంగా ఉంది. దర్శకుడు వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్​గా నటించింది. ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు, ట్రైలర్​ ఆడియెన్స్​ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రీ రిలీజ్​ ఈవెంట్​ సైతం గ్రాండ్​గా జరిగింది. ఈ మూవీ విషయంలో చాలా కాన్ఫిడెన్స్​గా ఉన్నట్లు తెలుస్తోంది. హరిస్ జైరాజ్​ మ్యూజిక్​ అందించిన ఈ సినిమాను శ్రేష్ఠ్​ మూవీస్ బ్యానర్ నిర్మించింది. ఈ నెల 8న ఈ మూవీ రిలీజ్​ కానుంది.