Home Blog

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

0

పశుసంవర్థక శాఖ కేసులకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలపై సీరియస్ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖకు సంబంధించిన కేసులు ఏసీబీ(ACB)కి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గొర్రెల పంపిణీ వ్యవహారంలో అక్రమాలకు సంబంధించి పశసంవర్థక శాఖపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.

48 ఇదేనిజం తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైళ్ల మాయంపైనా కేసు నమోదైంది. ఈ రెండు కేసులను ఏసీబీకి బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గొర్రెల పంపిణీ నిధుల బదిలీల్లో ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి గచ్చిబౌలిలో ఇప్పటికే అధికారులపై, పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫైల్స్ మాయంపై కేసు నమోదైంది.

పండగ వేళ నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డుప్రమాదం..

0

నాగర్ కర్నూల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. జిల్లాలో వంగూరు మండలం, తిప్పారెడ్డిపెల్లి గేటు వద్ద ఈరోజు ఉదయం డ్రైవర్ తప్పిదం వల్ల కారు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలవ్వగా.. 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను హైదరాబాద్, ఉప్పల్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మెట్రో ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. మూడు రోజులు ఎక్కడి నుంచి ఎక్కడికైనా..

0

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రయాణికులకు UN LIMITED ప్రయాణ సౌకర్యాన్ని తీసుకువచ్చింది. సూపర్ సేవర్ కార్డును రూ.59తో రీచార్జ్ చేయించుకుంటే సరిపోతుంది. మెట్రోలో ఒక రోజంతా ఎక్కడ్నించి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ సదుపాయం అమలులో ఉంటుంది. 

మెట్రో రైల్వే స్టేషన్లలోని కౌంటర్లలో ఈ సూపర్ సేవర్ కార్డులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ మెట్రో సూపర్ సేవర్ కార్డులను ఎప్పటినుంచో ఇస్తోంది. ఈ కార్డును ఒకసారి కొనుగోలు చేయాలంటే రూ.109 చెల్లించాలి. ఇప్పుడు ఈ కార్డును రూ.59తో రీచార్జ్ చేసుకుంటే UN LIMITED ప్రయాణ సౌకర్యాన్ని పొందుతారు.

‘బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు’

0

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుండి 14 లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు స్వయంభు రామలింగేశ్వర స్వామి వారిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతామని, బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉంటే.. కేసీఆర్‌ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు మాత్రమే అన్ని రకాలుగా లాభపడ్డారన్నారు.

లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పునరుద్ధరిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా అవినీతిమయమన్నారు. 6 గ్యారంటీల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందన్నారు. బండి సంజయ్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని ఆయన మండిపడ్డారు. మేమంతా రామ భక్తులమే రామ మందిరం అంశాన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ఈవెంట్ గా మారుస్తున్నారన్నారు. శంకరాచార్యులు , మఠాధిపతులు రామమందిర ప్రతిష్ఠకు దూరంగా ఎందుకు ఉంటున్నారో బండి సమాధానం చెప్పాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.

అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. ఎంటో తెల్సా..?

0

దాదాపు 14 నెలల తర్వాత విరాట్ కోహ్లీ టీ20 ఆడేందుకు సిద్ధమయ్యాడు. అఫ్గానిస్థాన్ పై చెలరేగి ఘనంగా పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ఇండోర్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కోహ్లీ 35 రన్స్ చేస్తే అరుదైన ఘనత సాధించనున్నాడు. టీ20ల్లో 12,000 మార్కును అందుకోనున్నాడు. దీంతో ఈ మార్కును అందకున్న తొలి భారత్ ఆటగాడికి కోహ్లీ రికార్డ్ నెలకొల్పుతాడు.

పొట్టి క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ క్రిస్ గేల్(14562) పేరిట ఉండగా.. తర్వాత షోయబ్ మాలిక్(12,993), విండీస్ మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్(12,430) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

TSRTC.. అమ్మాయిలు పొట్టుపొట్టు కొట్టుకున్నారు..

0

తెలంగాణ ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం మరోసారి మహిళల పైటింగ్ కు దారితీసింది. మహాలక్ష్మీ స్కీమ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి సీట్ల కోసం ఆడవాళ్ల ఫైటింగ్ లు పెరిగిపోతున్నాయి. తాజాగా సీట్ల కోసం ఇద్దరు అమ్మాయిలు జుట్టు పట్టుకుని చితక్కొట్టుకున్న మరో వీడియో వైరల్ అయింది. సంగారెడ్డి జిల్లాలో ఈ ఫైటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

నలుగురు అమ్మాయిలు జుట్లు పట్టుకుని పిడిగుద్దులతో దారుణంగా కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు ఆపే ప్రయత్నం చేసినా ఆగకుండా సిగపట్లకు దిగడంతో తోటి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా పండగలు, సెలవు రోజుల్లో రద్దీ కారణంగా సీట్లు దొరకక ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని అధికారులు స్పందించి ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Ration card : రేషన్ కార్డుదారులు బిగ్ అలెర్ట్.. ఇలా చేయకుంటే రేషన్‌ కట్..!!

0

Ration card : కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31 లోపు E-KYC చేయని వారి అన్ని రేషన్ కార్డులు (Ration card) రద్దు చేయబడతాయని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 7.55 లక్షల మంది లబ్ధిదారులు తమ రేషన్ కార్డు కేవైసీని ఇంకా పూర్తి చేయలేదని తెలిసింది. అటువంటి లబ్ధిదారులందరి కార్డులను తక్షణమే రద్దు చేస్తామని, ప్రభుత్వం నుండి సబ్సిడీలు మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆహార ధాన్యాలను పూర్తిగా రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రేషన్ లబ్ధిదారుల ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. E-KYC ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు డీలర్ ప్రాంగణంలో జరుగుతుంది. ఈ విభాగం లబ్ధిదారుల ఫేషియల్ e-KYC సౌకర్యాన్ని ప్రారంభించింది. దీని ద్వారా, ఏ లబ్ధిదారుడైనా తన మొబైల్ ఫోన్ నుండి e-KYC యాప్ Aadhar Face RD యాప్ ద్వారా దేశంలోని ఏ ప్రదేశం నుండైనా తన KYCని చేసుకోవచ్చు.

PBKS vs GT : నేడు గుజరాత్ vs పంజాబ్ మ్యాచ్.. మొదటి బ్యాటింగ్ ఎవరంటే..?

0

PBKS vs GT : ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా నేడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ మొదటి బ్యాటింగ్ చేయనుంది. గుజరాత్ జట్టులో కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, జోస్ బట్లర్, షారుఖ్ ఖాన్, రబాడ, రషీద్ ఖాన్, సిరాజ్, ఫరీద్ కృష్ణ ఉన్నారు. పంజాబ్ జట్టులో శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టొయినిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కె యన్సెన్, అర్షదీప్, యుజువేంద్ర చహల్ ఉన్నారు.

Samantha : రహస్యంగా సమంత నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటో..!!

0

Samantha : సమంత (Samantha) నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగా ఉంటుంది. తాజాగా సమంత రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే వార్త హాట్ టాపిక్ అయింది. ”ది ఫ్యామిలీ మ్యాన్ 2” మరియు సిటాడెల్ వంటి సిరీస్‌లలో సమంత నటించింది. అయితే ఈ వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు సమంత, రాజ్ నిడిమోరు మధ్య బంధం ఏర్పిడినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఇటీవల, రాజ్ తో సమంత దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మరోసారి సమంత ఫోటో వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో సమంత వేలికి వజ్రపు ఉంగరం ఉంది. ఈ క్రమంలో సమంత, రాజ్ నిడిమోరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు అని సమాచారం. త్వరలోనే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని ఇండస్ట్రీ సన్నిహితులు అంటున్నారు.Samantha pelli ఇదేనిజం Samantha : రహస్యంగా సమంత నిశ్చితార్థం.. వైరల్ అవుతున్న ఫోటో..!!

BSNL అన్‌స్టాపబుల్ ప్లాన్.. 90 డేస్ వ్యాలిడిటీతో బెస్ట్ ఆఫర్స్

0

BSNL : ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL తన యూజర్స్ కోసం తక్కువ ధరలు మరియు మెరుగైన ప్రయోజనాలను అందించే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తెస్తుంది. ఈ క్రమంలో తాజాగా తన యూజర్స్ కోసం 90 డేస్ వ్యాలిడిటీతో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అందిబాటులోకి తెచ్చింది.

BSNL రూ.439 ప్లాన్ : BSNL యొక్క ఈ రీఛార్జ్ ప్లాన్ పూర్తి మూడు నెలలు అంటే 90 రోజుల చెల్లుబాటును ఇస్తుంది. దీనితో పాటు, చెల్లుబాటు కాలంలో వినియోగదారులకు 300 SMSలు కూడా ఇవ్వబడుతున్నాయి. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్‌తో వస్తుంది. వినియోగదారులు దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కైనా అపరిమిత కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. వారు రోమింగ్ లేదా స్థానిక కాల్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కాలింగ్ మరియు SMS ప్లాన్, కాబట్టి దీనిలో డేటా ప్రయోజనం ఇవ్వబడదు. ఈ రీఛార్జ్ ప్లాన్ తమ BSNL నంబర్‌ను కాల్ చేయడానికి ఉపయోగించే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మీకు కాలింగ్‌తో పాటు రోజువారీ డేటా అవసరమైతే, BSNL యొక్క రూ. 599 రీఛార్జ్ ప్లాన్ మెరుగైన ఎంపిక అని నిరూపించవచ్చు. ఈ 84 రోజుల ప్లాన్‌లో, వినియోగదారులకు ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటా అందించబడుతుంది. ఈ పరిమితి పూర్తయిన తర్వాత, డేటాను 40Kbps వేగంతో యాక్సెస్ చేయవచ్చు. ఇది కాకుండా, ఈ ప్లాన్ దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కైనా అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMSలను కూడా అందిస్తుంది. ఈ విధంగా చూస్తే, రోజుకు దాదాపు రూ.7 ఖర్చుతో, ఈ ప్లాన్ రోజువారీ డేటా, అపరిమిత కాలింగ్, వాలిడిటీ మరియు SMS ప్రయోజనాలను అందిస్తోంది.

Tax : పన్ను చెల్లింపుదారులకు శుభవార్త.. 50 శాతం రాయితీ..!!

0

Tax : ఆంధ్రప్రదేశ్ లో ఆస్తి పన్ను (Tax) చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పన్ను బకాయిలకు రాయితీ ప్రకటిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం రాయితీని ప్రకటిస్తూ జీఓ విడుదల చేసింది. మార్చి 31, 2025లోపు చెల్లించే బకాయిలకు మాత్రమే 50 శాతం వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రజల నుండి వచ్చిన అభ్యర్థనలకు మరియు కోట్లాది రూపాయల ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడానికి అనుగుణంగా వడ్డీ సబ్సిడీ మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

Prabhas : ప్రభాస్‌కు విలన్గా విజయ్ సేతుపతి..?

0

Prabhas : ”కల్కి 2898 AD” సూపర్ సక్సెస్ తర్వాత, ప్రభాస్ (Prabhas) ”స్పిరిట్” సినిమాలో నటిస్తున్నాడు. ”యానిమల్” ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా భారీ స్థాయిలో సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రభాస్ తో కలిసి విజయ్ సేతుపతి నటించబోతున్నాడు అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్‌కు విలన్గా విజయ్ సేతుపతి నటించబోతున్నాడు. ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ వర్సెస్ విజయ్ సేతుపతి పోరాటాన్ని చూడటానికి అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ”స్పిరిట్” సినిమాని భద్రకాళి పిక్చర్స్ మరియు టి-సిరీస్ నిర్మిస్తున్నాయి.

Raithulu : రైతులకు కేంద్రం శుభవార్త.. అకౌంట్లలోకి 25,000 జమ.. వీరికి మాత్రమే..!!

0

Raithulu : భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. రైతులకు (Raithulu) ఆర్థిక సహాయం అందించడానికి మరియు వారి ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక మంచి పథకాలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో కిసాన్ ఆశీర్వాద్ అనే పధకాన్ని తెచ్చింది. రైతులకు సాధికారత కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఈ పథకాన్ని ప్రారంభించింది.

కిసాన్ ఆశీర్వాద పథకం రైతులకు వారి భూమి పరిమాణం ఆధారంగా నేరుగా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఐదు ఎకరాల భూమి ఉన్న రైతులకు 25,000 ఇవ్వనున్నారు. నాలుగు ఎకరాల భూమి ఉన్న రైతులకు 20,000 అలాగే రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు 5,000 నుండి 10,000 అందించనున్నారు. అదనంగా, ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకున్న రైతులు సంవత్సరానికి ₹6,000 అందుకుంటారు. అంటే 5 ఎకరాల భూమి ఉన్న రైతులు రెండు పథకాల నుండి కలిపి సంవత్సరానికి మొత్తం ₹31,000 అందుకుంటారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన భారతదేశం అంతటా రైతులకు ఏటా ₹6,000 అందజేస్తుండగా, జార్ఖండ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన రైతులకు మద్దతుగా సంవత్సరానికి అదనంగా ₹25,000ను ప్రవేశపెట్టింది.

ఈ పథకాన్ని అవసరమైన పత్రాలు : ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికేట్, భూమి రికార్డులు, మొబైల్ నంబర్ & పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్

Bird flu : ఇండియాలోనే కాదు.. ఇంగ్లాండ్‌లో కూడా బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి

0

Bird flu : మొన్నటివరకు ఇండియాలో బర్డ్ ఫ్లూ (Bird flu) విజృభించింది. ఈ బర్డ్ ఫ్లూ వైరస్ కారణంగా లక్షలాది కోళ్లు చనిపోయాయి. తాజాగా ఈ వైరస్ ఇంగ్లాండ్‌లో కూడా ప్రవేశించింది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని ఒక గొర్రెలో బర్డ్ ఫ్లూ గుర్తించబడిందని, ఇది బ్రిటన్‌లో మొదటి కేసు అని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది. సాధారణ తనిఖీలలో గొర్రెలలో బర్డ్ ఫ్లూ గుర్తించబడిందని బ్రిటిష్ ప్రభుత్వం తెలిపింది. పక్షులు మరియు జంతువులలో కనుగొనబడిన ఈ వైరస్ మానవులకు వ్యాపించిందని నిర్ధారించబడలేదు. వ్యాధి సోకిన గొర్రె పాలు పాజిటివ్‌గా పరీక్షించబడ్డాయి. వ్యాధి సోకిన గొర్రెను చంపారు, మరియు మందలో ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. బర్డ్ ఫ్లూ నివేదించబడిన ప్రదేశాలలో ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ ప్రపంచవ్యాప్తంగా క్షీరదాల ద్వారా వ్యాపిస్తుందని గుర్తించామని UK ఆరోగ్య భద్రతా సంస్థ కార్యదర్శి మీరా చంద్ తెలిపారు. ప్రాణాంతకమైన బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఇప్పుడు సర్వసాధారణం. ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించినప్పటికీ, మానవులకు అంత తేలికగా వ్యాపించదని నిపుణులు అంటున్నారు. 2024లో అమెరికన్ పాడి ఆవులలో మొదట కనిపించిన బర్డ్ ఫ్లూ, అప్పటి నుండి విస్తృతంగా వ్యాపించింది.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు..!

0

మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త అందించారు. 2029 నాటికి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు ఉండవల్లిలోని తన ఇంట్లో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం రెండో సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకూ కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల 5,27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని లోకేష్ స్పష్టం చేశారు.

ఉద్యోగాలు చేసే మహిళలకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

0

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలు చేసే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలు రాత్రిపూట కూడా భయం లేకుండా ప్రయాణించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు ప్రైవేట్ ప్రభుత్వ రవాణా బస్సులు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లలో ‘వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్‌లను’ తప్పనిసరి చేసింది. మహిళలు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటే, ఒకే బటన్‌ను నొక్కితే సెకన్లలోపు వారిని పోలీసులు చేరుకుంటారని తెలిపింది. నిర్భయ చట్టం ప్రకారం కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు, పాత వాటిలోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.