Home Blog Page 1271

#Nizam #Hyderabad : ఆ డ‌బ్బు తిరిగివ్వాల‌ని కేంద్రాన్ని కోరిన‌ నిజాం మ‌నుమ‌డు

0

The last Nizam Nawab Mir Usman Ali Khan’s grandson Najif Ali Khan wrote a letter to Union Finance Minister Nirmala Sitharaman. In the letter, he said the Nizam Jewelery Trust’s income and wealth tax dispute has been pending with the Income Tax Department for 26 years and should be rectified immediately.

చివ‌రి నిజాం న‌వాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మ‌న‌ుమడు న‌జ‌ఫ్ అలీ ఖాన్‌.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌కు లేఖ రాశారు. నిజాం జువెల‌రీ ట్ర‌స్ట్ ఆదాయ‌, సంప‌ద ప‌న్నుకు సంబంధించిన వివాదం 26 ఏళ్లుగా ఆదాయ ప‌న్ను శాఖ ద‌గ్గ‌ర పెండింగ్‌లో ఉన్న‌ద‌ని, దీనిని వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని ఆ లేఖ‌లో ఆయ‌న‌ కోరారు.

ఇప్ప‌టికే ఇందులోని మొత్తం 114 ల‌బ్ధిదారుల్లో 39 మంది చ‌నిపోయార‌ని, మిగిలిన వాళ్ల‌లో చాలా మంది ఆరోగ్య, ఆర్థిక స‌మస్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని ఆ లేఖ‌లో న‌జ‌ఫ్ అలీ ఖాన్ చెప్పారు.

ఈ వివాదం ఎక్క‌డ మొద‌లైందో న‌జ‌ఫ్ ఆ లేఖ‌లో వివ‌రించారు. దాని ప్ర‌కారం.. 1950ల‌లో చివ‌రి నిజాం కొన్ని ట్రస్ట్‌ల‌ను ఏర్పాటు చేశారు. అందులో ఒక‌టి నిజాం జువెల‌రీ ట్ర‌స్ట్‌.

ఇందులోని న‌గ‌ల‌ను అమ్ముకోవ‌డానికి ట్ర‌స్టీలైన ప్రిన్స్ ముఫ‌ఖ‌ంజా, ప్ర‌భుత్వం నామినేట్ చేసిన అధికారికి అధికారం క‌ట్ట‌బెట్టారు. 1995లో ఈ న‌గ‌ల‌ను రూ. 206 కోట్ల‌కు కొన‌డానికి ప్ర‌భుత్వం అంగీక‌రించింది.

ఈ మొత్తాన్ని నిజాం కుటుంబానికి చెందిన‌ 114 మంది ల‌బ్ధిదారుల‌కు స‌మానంగా పంచారు. అయితే, న‌గ‌ల‌ను అప్ప‌గించే స‌మ‌యంలో ఆదాయ పన్ను శాఖ త‌మ‌కు రూ. 30.50 కోట్ల ‘ఆదాయ‌, సంప‌ద ప‌న్ను’ బాకీ చెల్లించాల్సి ఉందని చెప్పింది.

ఆ మొత్తాన్ని ఆ రూ. 206 కోట్ల నుంచే చెల్లించారు.

ఈ మొత్తంలో రూ.15.45 కోట్ల‌ను బ‌కాయిల కోసం చెల్లించ‌గా.. వీటిలో చాలా వ‌ర‌కు రీఫండ్స్ రూపంలో వెన‌క్కి వ‌చ్చింది. కానీ, ఈ మొత్తాన్ని త‌ప్పుడు అకౌంట్ల‌లో వేశారు.

ఇంకా రూ.14.05 కోట్ల‌ను భ‌విష్య‌త్తులో ప‌న్ను చెల్లించ‌డం కోసం అప్ప‌టి ఎస్‌బీహెచ్‌లో (ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) జ‌మ చేసిన‌ట్లు ఆ లేఖలో న‌జ‌ఫ్ వెల్ల‌డించారు.

ఆ బ‌కాయిలు, రీఫండ్స్‌కు సంబంధించిన వివాదం ఇంకా కొన‌సాగుతోంది. ఆ రీఫండ్‌తోపాటు బ్యాంక్‌లో ఉంచిన రూ.14.05 కోట్లు కూడా నిజాం కుటుంబ ల‌బ్ధిదారుల‌కు పంచాల్సి ఉన్నా.. ఆదాయ పన్ను శాఖ మాత్రం పంచ‌డం లేదని న‌జ‌ఫ్ తెలిపారు.

తాము క్ర‌మం త‌ప్ప‌కుండా ప‌న్నులు చెల్లిస్తున్నా కూడా ఇన్‌క‌మ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ మాత్రం ఇంకా రూ. 8.54 కోట్ల ప‌న్ను బాకీ ఉన్న‌ట్లుగా చెబుతున్న‌ద‌ని, ఇన్నేళ్లుగా ప‌రిష్కారానికి నోచుకోని ఈ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని న‌జ‌ఫ్ ఆ లేఖ‌లో కోరారంటూ ఈ కథనంలో తెలిపారు.

#BirdFlue #Chicken : చికెన్​ తింటే మరణమేనా…?

0

The list of states where bird flu cases have been reported in India is growing. The bird flu has been diagnosed in Kerala, Rajasthan, Madhya Pradesh, Himachal Pradesh, Haryana, Gujarat and Uttar Pradesh, the government said.

భారత్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన రాష్ట్రాల జాబితా పెరుగుతోంది. కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పక్షులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

తాజాగా దిల్లీలోని సంజయ్ లేక్‌లో బాతులు ఒక్కసారిగా చనిపోయాయి. వీటి నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ పరీక్షల్లో బాతులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలిందని దిల్లీ జంతు సంరక్షణ విభాగం అధికారులు వెల్లడించారు.

ఛత్తీస్‌గఢ్‌లోనూ భారీగా పక్షులు మరణిస్తున్నాయని, వాటి నామూనాలు పరీక్షల కోసం పంపించామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

మహారాష్ట్రలోని ముంబయికి 500 కి.మీ. దూరంలోనున్న పర్బనీలో గత రెండు రోజుల్లో దాదాపు 800 పక్షులు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. వీటి నమూనాలను కూడా పరీక్షల కోసం పంపించామని అధికారులు వెల్లడించారు.

మరోవైపు పశువులకు ఇచ్చే టీకాల అందుబాటుపై సమీక్ష చేపట్టాలని పశు సంవర్ధక విభాగం అధికారులకు వ్యవసాయ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ సూచించింది. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఈ కమిటీ భేటీ అయ్యింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలా?

ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్‌ మనకు సోకకుండా అడ్డుకోవచ్చని వివరిస్తున్నారు.

బర్డ్ ఫ్లూలో చాలా రకాలు ఉంటాయి. వీటిలో చాలావరకు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపలేవు. అయితే, ఈ వైరస్‌లలో కొన్ని మనుషులకు సోకే అవకాశముంటుంది.

అయితే, భారత్‌లో ప్రస్తుతం మనుషులకు ఈ వైరస్ సోకినట్లు ఎలాంటి కేసులూ నిర్ధారణ కాలేదు. అయితే, పౌల్ట్రీల్లో పనిచేసేవారు, పక్షులతో ఎక్కువసేపు దగ్గరగా గడిపేవారు పీపీఈ కిట్లు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.

మరోవైపు బర్డ్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పక్షులను స్థానిక ప్రభుత్వాలు వధిస్తున్నాయి. మిగతా పక్షులతోపాటు మనుషులకు ఈ వైరస్ సోకకుండా చర్యలు తీసుకుంటున్నాయి.

పక్షులకు ఈ వైరస్ ఎలా సోకుతుంది?

హెచ్5ఎన్1 లాంటి ఏవియెన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ సోకిన పక్షులకు దగ్గరగా వెళ్లినప్పుడు మిగతా పక్షులకు ఈ వైరస్ సోకుతుంది.

ఈ వైరస్ సోకి మరణించిన పక్షుల మృతదేహాలకు దగ్గరగా వెళ్లినప్పుడు కూడా బతికుండే పక్షులకు ఈ వైరస్ సంక్రమిస్తుంది.

పక్షుల రెట్టల నుంచి కళ్లు, నోటి నుంచి వెలువడే ద్రవాల వరకు… అన్నింటిలోనూ ఈ వైరస్ జాడలు ఉంటాయి.

కొన్ని పక్షుల్లో అసలు ఎలాంటి లక్షణాలూ కనిపించవు. అయితే వీటి వల్ల ఇతర పక్షులకు వైరస్ వ్యాపించే ముప్పు ఉంటుంది. వలస పక్షుల వల్ల ఇవి ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తుంటాయి.

మనుషులకు ఎలా సోకుతుంది?

ఈ వైరస్ సోకిన పక్షులకు సమీపంలో ఎక్కువ సేపు గడిపినప్పుడు ఎక్కువగా ఈ వైరస్ మనుషులకు సోకుతుంది. ముఖ్యంగా పౌల్ట్రీల్లో పనిచేసేవారికి ఈ వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా బర్డ్ ఫ్లూ మనుషుల్లో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.

అయితే, ఏదో ఒకరోజు ఈ వైరస్ కూడా జన్యు పరివర్తన చెంది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే సామర్థ్యాన్ని సాధించొచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

1918లో లక్షల మంది మరణాలకు కారణమైన స్పానిష్ ఫ్లూ ఇలానే పక్షుల నుంచి మనుషులకు సంక్రమించిందని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి.

తాజా కోవిడ్-19 వైరస్ కూడా జన్యుపరివర్తన చెందడంతో మనుషుల మధ్య వ్యాపించగలిగే సామర్థ్యాన్ని సంపాదించగలిగింది.

ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి?

జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, జలుబు, వణుకు లాంటి లక్షణాలతో మనుషుల్లో బర్డ్ ఫ్లూ మొదలవుతుంది.

సాధారణ ఫ్లూ లక్షణాలే బర్డ్ ఫ్లూ సోకినప్పుడూ కనిపిస్తాయి. వైరస్ సోకిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత ఈ లక్షణాలు ఒక్కసారిగా కనిపిస్తాయి.

చికిత్స ఏమిటి?

లక్షణాలు తగ్గేందుకు యాంటీవైరల్ ఔషధాలను వైద్యులు సూచిస్తారు. పారాసిటమాల్ లాంటి నొప్పి నివారిణులను కూడా ఇస్తుంటారు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఎలాంటి ఫ్లూలు విజృంభిస్తున్నప్పుడైనా.. తరచూ చేతులు కడుక్కోవడం; దగ్గేటప్పుడు, తుమ్మేటప్పుడు గుడ్డలు అడ్డుపెట్టుకోవడం లాంటి చర్యలతో ముప్పును తగ్గించుకోవచ్చు.

ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు, మరుగుదొడ్డి ఉపయోగించేటప్పుడు చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవాలి.

దగ్గు, తుమ్ములు లాంటి లక్షణాలు కనిపించే వారి నుంచి సామాజిక దూరం పాటించాలి.

కోళ్లు, బాతులకు మీరు ఆహారం వేయొచ్చు. అయితే ఆహారం వేసిన వెంటనే చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. చనిపోయిన, జబ్బు పడిన పక్షుల దగ్గరకు పోకూడదు.

చికెన్ తినొచ్చా?

శుభ్రంగా వండితే వైరస్ చనిపోతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళనా అవసరం లేదు.

చికెన్, గుడ్లు శుభ్రంగా, పూర్తిగా వండేలా జాగ్రత్తలు తీసుకునేంత వరకు వీటి నుంచి ఎలాంటి ముప్పూ ఉండదు.

#CM #Jagan #AP : ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాక్​

0

TDP shock to AP CM Jagan and lodged a complaint with the DGP. TDP senior leader and politburo member Varla Ramaiah wrote a letter to Gautam Sawang to this effect.

ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ షాకిచ్చింది.. ఆయనపై ఏకంగా డీజీపీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గౌతమ్‌ సవాంగ్‌కు టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు.

నెల్లూరులో ఈ నెల 11న జరిగిన అమ్మఒడి సభలో సీఎం జగన్‌ ఆలయాలపై దాడుల గురించి ప్రస్తావించారని.. ఈ దాడులు చేస్తున్నవారు తనకు తెలుసని అన్నారని గుర్తు చేశారు.

రథాలు తగులబెట్టిన వారే రథయాత్రలు చేస్తున్నారని.. డీజీపీ వెంటనే సీఎంకు నోటీసు ఇచ్చి.. ఆలయాలు ధ్వంసం చేసిందెవరో చెప్పించాలని కోరారు. వర్ల రామయ్య లేఖతో పాటు జగన్‌ ప్రసంగ వీడియోను కూడా పంపారు.

నెల్లూరులో ఈ నెల 11న అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వల్ల ప్రతిపక్షాలకు రాష్ట్రంలో చోటు లేకుండా పోతుంది కాబట్టే కడుపుమంటతో రాష్ట్రంలో అశాంతి సృష్టిస్తున్నాయని జగన్ ఆరోపించారు.
అర్ధరాత్రి ఎవరూ లేని ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నది ఎవరో ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు.
రథాలు తగులబెట్టిన వారే రథయాత్రలు కూడా చేస్తున్నారని ఆరోపించారు.

ప్రజలకు మంచి చేసే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా.. ఆ కార్యక్రమానికి ఒకటి రెండు రోజుల ముందు, తర్వాత గుళ్లు, గోపురాలను టార్గెట్ చేస్తున్నారన్నారు ముఖ్యమంత్రి.

ప్రభుత్వం చేసే మంచి ప్రజలు, ప్రపంచానికి తెలయకూడదన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారన్నారు. దేవుడిపై భక్తి లేనివారు, పట్టపగలే గుళ్లను కూల్చేసిన వారు, ఆలయ భూములను కాజేసిన వారు, అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన వారు ఉన్నట్లుండి కొత్త వేషం కడుతున్నారని.. దేవుడిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని.. ఇన్నాళ్లూ గుళ్లపై పడిన వారు రేపు బడులపై పడతారేమో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

#SupremeCourt #AgriBills : వ్వయసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే

0

The Supreme Court has imposed stay on three new agricultural laws brought by the Center. Stay tuned until orders are placed again.

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్వయసాయ చట్టాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది.

మళ్లీ ఆర్డర్స్ ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని చెప్పింది. అగ్రి చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది.

సమస్య పరిష్కారానికి నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది సుప్రీంకోర్టు.

కమిటీలో వ్యవసాయ శాస్త్రవేత్తలు,ఎకనమిస్టులు అశోక్ గులాటి, డాక్టర్ ప్రమోద్ కుమార్ జోషి, అనిల్ దనావత్, హర్ సిమ్రత్ మన్ ఉన్నారు.

ఈ కమిటీ ముందు రైతులు తమ సమస్యలను చెప్పుకోవచ్చన్నారు. పరిష్కారం కావాలనుకునే వారు కమిటీని సంప్రదించాలన్నారు.

కమిటీ ఉద్దేశం ప్రభుత్వాన్ని శిక్షించడం కాదన్న సుప్రీంకోర్టు…. నివేదిక రూపొందించేందుకేనని స్పష్టం చేసింది.

చట్టాలను తాత్కాలికంగా నిలిపేసే అధికారం కూడా తమకు ఉందని తెలిపింది. రైతులు నిరవధిక నిరసన చేసుకోవచ్చన్నారు.

ఇవి రాజకీయాలు కాదని… న్యాయవాదులు తమకు అనువుగా వాదన మార్చుకోవడం సరికాదని  చెప్పింది.

కేవలం వ్యతిరేకాంశాలను మాత్రమే చెప్పడం సరికాదని… సానుకూలాంశాలను కూడా చెప్పాలని సూచించింది.

#AlluArjun #PoojaHegde : తను నా లక్కీ గర్ల్​

0

It is known that the movie ‘Ala Vaikunthapuramulo’ starring stylish star Allu Arjun and Buttabomma Pooja Hegde as heroines is a blockbuster under the direction of Trivikram Srinivas.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్, బుట్టబొమ్మ పూజా హెగ్డేలు హీరోహీరోయిన్‌లుగా న‌టించిన ‘అల వైకుంఠపురములో’ మూవీ బ్లక్‌బస్టర్‌గా అయిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం బన్నీ కేరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. గతేడాది సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా విడుదలై నిన్నటికి(జవవరి 11) సరిగ్గా ఏడాది.

ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మూవీ యానివర్సరీని పురస్కరించుకుని ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సందడి చేసింది.

ఇందుకు సంబంధించిన ఫొటోలను బన్నీ‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

ఈ సందర్భంగా పూజా హెగ్డేతో కలిసి ఉన్న ఫొటోకు ‘నా గుడ్‌ లక్‌ చామ్‌గా ఉన్నందుకు ధన్యవాదాలు‌’ అంటూ షేర్‌ చేశాడు.

అంతేగాక ఈ కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని ఫొటోలను కూడా బన్నీ ఈ సందర్భంగా షేర్‌ చేశాడు.

దర్శకుడు త్రివిక్రమ్‌, సహానటుడు సుశాంత్‌, అల్లు శీరిష్‌లతో కలిసి తీసుకున్న సెల్ఫీలను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో పంచుకున్నాడు

#Trump #USA : ట్రంప్‌కు వ్యతిరేఖంగా సొంత పార్టీ నేతలు

0

Some Republicans, who are already masters of Trump’s stance, have announced that they will vote in support of the impeachment motion to remove him from the House of Representatives.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభిశంసన ఆయన సొంత పార్టీ రిపబ్లికన్‌లో చీలకలకు కారణమవుతోంది.

ట్రంప్‌ తీరుపై ఇప్పటికే గుర్రుగా ఉన్న కొంత మంది రిపబికన్లు.. ఆయనను తొలగించేందుకు ప్రతినిధుల సభలో ప్రవేశపెడుతున్న అభిశంసనకు మద్దతుగా ఓటేయనున్నట్లు ప్రకటించారు.

తొలుత రిపబ్లికన్‌ పార్టీలో మూడో అత్యంత శక్తిమంతమైన నేతగా పెరుగాంచిన లిజ్‌ చెనీ ట్రంప్‌పై అభిశంసనకు మద్దతు పలికారు.

అమెరికా చరిత్రలో అధ్యక్ష హోదాను ట్రంప్‌ దుర్వినియోగపరిచినంతగా మరెవరూ చేయలేదని ఆమె విమర్శించారు.

క్యాపిటల్‌ భవనంపై దాడి ట్రంప్‌ పిలుపు మేరకే జరిగిందని ఆరోపించారు. దాడి జరిగేసమయంలో ట్రంవ్‌ జోక్యం చేసుకొని నిలువరించాల్సిందని అభిప్రాయపడ్డారు.

మరో నేత ఆడమ్‌ కిన్‌జింగర్‌, జాన్‌కట్కో కూడా చెనీ బాటలోనే పయనించనున్నట్లు ప్రకటించారు.

మరికొంత మంది కూడా ట్రంప్‌నకు వ్యతిరేకంగాఓటు వేయనున్నట్లు అమెరికా మీడియా పేర్కొంది.

అదే పార్టీలోని మరో వర్షం ట్రంవ్‌ అభిశంసనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చివరి రోజుల్లో ఈ ప్రక్రియపారంభించడం కేవలం రాజకీయ కుట్రేనని ఆరోపించింది.

దీనివల్ల అధికార బదిలీకి ఆటంకం కలిగే అవకాశంఉందని అభిప్రాయపడింది. అయితే, డెమొక్రాట్లు మాత్రం ట్రంవ్‌ తొలగించేందుకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు నేడు ప్రతినిధుల సభలో అభిశంసనపై ఓటింగ్‌ జరగనుంది.

#BSE #Market : దేశీయ మార్కెట్ దూకుడు

0

The domestic market also started trading positive on Wednesday.

Shares of almost all sectors continue to be in gains. With this, both the key indicators are breaking new records.

దేశీయ మార్కెట్టు బుధవారం కూడా పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి.

దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. దీంతో కీలక సూచీలు రెండూ సరికొత్త రికార్డులను నమోదు  చేస్తూ దూసుకుపోతున్నాయి.

సెన్సెక్స్‌ 256  పాయింట్లు  ఎగిసి 48773 వద్ద, నిఫ్టీ 85 పాయింట్లు 14647 వద్ద  ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 50 వేల వైపు  పరుగులు పెడుతోంది.

నిఫ్టీ 14600 ఎగువన స్థిరంగా  కొనసాగుతుండగా, బ్యాంకు నిఫ్టీ సరికొత్త ఆల్‌ టైం హైని టచ్‌ చేసింది.

ప్రధానంగా కరోనా అంతానికి దేశంలో రెండు వ్యాక్సిన్ల్లు అందుబాటులోకి రావడం,   మరి రెండు రోజుల్లో  వ్యాక్సినేషన్‌ మెగా  డ్రైవ్‌ షురూ కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ పాజిటివ్‌గా ఉంది.

దీంతో ఆసియా అంతటా మార్కెట్లు   మిశ్రమంగా ఉన్నప్పటికీ  మన సూచీలు లాభాలతో కళకళలాడుతున్నాయి.

వ్యాక్సిన్‌ డోస్‌లు పలు నగరాలకు చేరడంతో ఆర్థిక వ్యవస్థ రికవరీ ఆశలు పుంజుకున్నాయి.

#Bike : భారత్​లో దూసుకొస్తున్న విదేశీ బైక్​లు

0

The Indian company TVS .. acquired Norton earlier this year with plans to expand the range of British bike brand Norton products.

బ్రిటిష్ బైక్ బ్రాండ్ నార్టన్ ఉత్పత్తులను విస్తృతంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలతో ఈ ఏడాది మొదట్లో భారతీయ సంస్థ టీవీఎస్.. నార్టన్‌ని కొనుగోలు చేసింది.

భారతీయ యాజమాన్య నిర్వహణలో విజయాన్ని చవి చూస్తున్న చరిత్రాత్మక రాయల్ ఎన్‌ఫీల్డ్ అడుగు జాడల్లో నడిచేందుకు నార్టన్ సన్నద్ధం అవుతోంది.

వ్యాపారాన్ని నిలబెట్టుకునేందుకు కష్టపడుతున్న పేరున్న బ్రాండ్లను లాభాల దిశగా పయనింప చేసేందుకు భారతీయ ఉత్పత్తిదారులు ఆసక్తి చూపడం పట్ల వ్యాపార నిపుణులు పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయటం లేదు.

బీఎస్ఏ బ్రాండు పేరుతో బ్రిటన్‌లో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేసి బ్రిటిష్ మోటార్ బైక్ పరిశ్రమను పునరుద్ధరణ చేయాలని ఆశిస్తున్నట్లు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర చెప్పారు.

ఈ మోటార్ బైక్‌లను బర్మింగ్‌హామ్‌లో 2021 మధ్యకల్లా తయారు చేయడం మొదలు పెట్టాలని మహీంద్రా గ్రూపు భావిస్తోంది.

కొత్తగా జీవం పోసుకున్న బీఎస్ఏ ఆక్స్‌ఫర్డ్ షైర్, బాన్బరిలో త్వరలోనే ఎలక్ట్రిక్ మోటార్ బైక్ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు ఒక పరిశోధనా కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. ఈ లోపు పెట్రోల్ ఇంజన్లతో నడిచే వాహనాలను తయారు చేస్తారు.

మోటార్ సైకిళ్ళ ఉత్పత్తిలో బ్రిటన్‌కున్న చరిత్రను బట్టి యూకేని పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నుకున్నట్లు ఆనంద్ మహీంద్ర చెప్పారు.

ఆయన ఆస్తుల విలువ 1.7 వేల కోట్ల రూపాయలు అని ఫోర్బ్స్ మ్యాగజైన్ అంచనా వేసింది.

బర్మింగ్ హాం స్మాల్ ఆర్మ్స్ (బీఎస్ఏ) ని 1861లో స్థాపించారు.

1950 నాటికి ట్రైయంఫ్ , సన్ బీమ్ బ్రాండ్లకు కూడా యాజమాన్య బాధ్యతలు వహిస్తూ ప్రపంచంలోనే అత్యధికంగా మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసే సంస్థగా బీఎస్ఏ నిలిచింది.

కానీ, ఈ సంస్థ ఆర్ధికంగా దివాళా తీయడంతో 1970ల నాటికి ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.

ఆ తర్వాత 2016లో దానిని మహీంద్రా గ్రూపు కొనుగోలు చేసింది.

బీఎస్ఏ అధికారికంగా క్లాసిక్ లెజెండ్స్ సంస్థ యాజమాన్యంలో ఉంది. ఈ సంస్థలో మహీంద్రా గ్రూపుకు 60 శాతం వాటా ఉంది.

ఈ సంయుక్త భాగస్వామ్యానికి యూకే ప్రభుత్వ మద్దతు కూడా లభించింది.

దీంతో బీఎస్ఏ ఎలక్ట్రిక్ బైకుల ప్రాజెక్టుకు యూకే ప్రభుత్వం 4.6 మిలియన్ పౌండ్ల గ్రాంటును జారీ చేసింది.

ఈ ఉత్పత్తి మొదలైతే 255 మందికి ఉద్యోగావకాశాలు లభించవచ్చని ఆశిస్తున్నారు.

“ఈ క్లాసిక్ బ్రిటిష్ వాహనం యువ వినియోగదారులను మాత్రమే కాకుండా తిరిగి యవ్వనంలోకి అడుగు పెట్టాలనుకునే బైక్ ప్రియులను కూడా ఆకర్షిస్తుంది” అని మోటార్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ స్కాట్ లుకైటీస్ అన్నారు.

“పాత బైక్‌కి ఉన్న శైలి, తరహాను ఎలక్ట్రిక్ బైక్‌లో కూడా అందివ్వగల్గితే, వారు ఈ వ్యాపారంలో గెలిచినట్లే” అని ఆయన అన్నారు.

“ఈ చిన్న వ్యాపార ప్రయత్నం యూకేలో బైక్ ఉత్పత్తి వ్యాపారాన్నే పునరుజ్జీవం చేయడానికి ఒక సంకేతం” అని మహీంద్ర బీబీసీతో అన్నారు.

భారతీయ సంస్థ టీవీఎస్ మోటార్ ఏప్రిల్లో నార్టన్ సంస్థను 16 మిలియన్ పౌండ్ల ఒప్పందానికి కొనుగోలు చేసింది

నార్టన్ 1898లో స్థాపించారు. ఇది బ్రిటిష్ మోటార్ సైకిల్ బ్రాండ్లలోనే అత్యంత పురాతనమైనది. ఇది మోటార్ స్పోర్టులో బాగా పేరున్న బ్రాండు, ఇందులో డామినేటర్, కమాండో బాగా పేరున్న మోడళ్ళు.

నార్టన్ ఇంటర్ పోల్ మోడల్‌ను యూకే పోలీసులు 1980లలో వాడేవారు.

ఈ సంస్థ ఉత్పత్తి చేసే వింటేజ్ మోడళ్లను మోటార్ బైకులను సేకరించే వారి దగ్గర ఉండాల్సిన కలెక్టర్ ఐటమ్స్ అని అంటారు.

గత నెల నార్టన్ కమాండో క్లాసిక్ బైకుల ఉత్పత్తిని మొదలుపెట్టింది. ఇది పూర్తి స్థాయి ఉత్పత్తిని 2021 మొదట్లో ప్రారంభిస్తుంది.

“దీని తర్వాత ఇప్పటికే బహిర్గతం చేసిన మరి కొన్ని మోడళ్లను ఉత్పత్తి చేయడం మొదలు పెడతాం.

మరి కొన్ని కొత్త మోడళ్లను కూడా తయారు చేస్తాం” అని సంస్థ ఇంటీరియం చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ రస్సెల్ అన్నారు

ఇప్పుడు రూపొందించిన వినూత్నమైన సౌకర్యాలతో ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని ఆయన అన్నారు.

ఈ బ్రిటిష్ బ్రాండు వాహనాలు భారతీయ రోడ్ల పై తరచుగా కనిపిస్తుంటాయి. ఇవి కొన్ని పాత సినిమాల్లో కూడా కనిపిస్తాయి.

పోలీసులు కూడా వీటిని వాడేవారు అని ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ సంస్థలో ఆటోమోటివ్ నిపుణుడు వివేక్ వైద్య చెప్పారు.

ఈ భావాత్మక కారణాలను పక్కన పెడితే, భారతీయ సంస్థలు మాత్రం చాలా ధృడమైన వ్యాపార సంకల్పాలతో ఈ సంస్థల్లో పెట్టుబడి పెట్టడానికి చైతన్యవంతం అయ్యారని ఆయన అంటారు.

“ఈ బ్రాండులు మార్కెట్లో నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడుతున్నాయి. దీనిని భారతీయ కంపెనీలు ఒక అవకాశంగా తీసుకున్నారు.

ఆ బ్రాండ్, లోగోను కొనుగోలు చేయడం ద్వారా భారతీయ వ్యాపారవేత్తలు పశ్చిమ దేశాల మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు సహకరిస్తుంది” అని ఆయన అన్నారు.

టాటా సంస్థ 2008లో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ను స్వాధీనం చేసుకుని లాభాలనార్జించే దిశగా తీసుకువెళ్లడాన్ని ఆయన ఉదహరించారు.

“ఇది భారతీయ ఉత్పత్తిదారులకు కచ్చితంగా పని చేస్తుందని నిరూపితమైన వ్యూహం. వారు ఒక బ్రాండును కొనుగోలు చేసి కొత్త దేశా

లకు విస్తరిస్తారు.

అలాగే, దాని పరిమాణం, లాభాలను కూడా పెంచుతారు. ఈ బ్రాండులకు ఇది దక్కాల్సిన అర్హతే” అని ఆయన అంటారు.

బ్రిటిష్ వాహనం రాయల్ ఎన్ ఫీల్డ్ వ్యాపారం కూడా విస్తృతంగా అభివృద్ధి చెందుతోంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్ బైక్ మార్కెట్ ఆసియాలోకి అడుగు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది.

నేటికీ ఉత్పత్తి జరుగుతున్న ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన బ్రాండ్లలో ఇదొకటి.

1994 నుంచి ఇది భారతీయ సంస్థ ఐషర్ ఆధీనంలోకి వచ్చింది. ఇది థాయ్‌లాండ్‌లో కొత్త ఫ్యాక్టరీని ప్రారంభించే ప్రణాళికలు ఉన్నట్లు ప్రకటించింది.

ఈ ప్లాంటు ఉత్పత్తిని 2021లో మొదలుపెట్టవచ్చు. ఇది భారతదేశానికి అవతల నెలకొల్పిన అతి పెద్ద ఫ్యాక్టరీ అవుతుంది.

మోటార్ బైకులను ఉత్పత్తి చేసే రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు గత సంవత్సరం 88 శాతం వృద్ధి అయ్యాయి.

1950, 60ల నుంచి ఈ చారిత్రాత్మక బ్రాండులు వ్యాపారం కొనసాగించేందుకు కష్టాలు పడుతున్నప్పటికీ , అవి పూర్తిగా అంతమైపోలేదు.

ఇప్పుడు అవి పూర్తిగా బ్రిటిష్ యాజమాన్యం చేతుల్లో లేనట్లే లెక్క.

#Nidhi Agarwal : డోస్​ పెంచుతున్న నిధి

0

Nidhi Agarwal, who has been busy on social media more than movies, recently shared a video through her Twitter account. She simply commented, “Did you make an entry into rehearsals?”

బాలీవుడ్ సినిమా ‘మున్నా మైఖేల్’ సినిమాతో సినీ గడప తొక్కిన అందాల నిధి అగర్వాల్.. ‘సవ్యసాచి’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఈ సినిమాతో అమ్మడికి అంతగా గుర్తింపు రాకపోయినా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమెను ఇస్మార్ట్ బ్యూటీగా లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు.

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌‌గా మారిన ఈ ముద్దుగుమ్మ తన పాపులారిటీని మరింత పెంచుకునేలా హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియా వేదికలను వేడెక్కిస్తోంది. గ్లామర్ డోస్ పెంచుతూ అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంటోంది.

సినిమాల కంటే ఎక్కువ‌గా సోష‌ల్ మీడియాలోనే బిజీ బిజీగా ఉంటున్న నిధి అగర్వాల్ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ వీడియో షేర్ చేసింది. దీనిపై సింపుల్‌గా ‘రిహార్సల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేశా’ అంటూ కామెంట్ చేసింది.
గ్లామర్ డోస్ పెంచేసి మంచి ఫైరింగ్‌లో కనిపిస్తూ ఈ వీడియోతో కుర్రకారును అట్రాక్ట్ చేసింది నిధి. ఇస్మార్ట్ బ్యూటీగా భారీ క్రేజ్ దక్కినా ఆశించిన టాలీవుడ్ నుంచి మేర అవకాశాలు మాత్రం రావడం లేదు.
దీంతో దర్శకనిర్మాతల చూపు తనపై పడేలా సోషల్ మీడియా వేదికగా తెగ హంగామా చేస్తోంది నిధి అగర్వాల్.
గ్లామ‌ర్ ప‌రంగా అందాల‌ను ఆర‌బోయడానికి సైతం వెనుకాడ‌ని నిధి అగ‌ర్వాల్‌ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఇప్పటికే ఆమె తమిళంలో జ‌యం ర‌వితో భూమి, శింబుతో ఈశ్వ‌ర‌న్ సినిమాల్లో న‌టించింది. ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతికే ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. అదేవిధంగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త‌ గ‌ల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గ‌ల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్త సినిమాలో ఆమె నటిస్తోంది. అతి త్వరలో ఈ మూవీ కూడా విడుదల కానుంది.

#Trump #USA : పదవికాలం తీరక ముందే పీకేస్తున్నారు…

0

Donald Trump has emerged as the most disgraced president in American history. Trump, who did not accept defeat in the election, acted to embarrass the presidency with his antics.

అమెరికా చరిత్రలోనే అత్యంత అప్రతిష్ఠను మూటగట్టుకున్న అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచిపోయారు. ఎన్నికల్లో ఓటమిని అంగీకరించని ట్రంప్.. తన చేష్టలతో అధ్యక్ష పీఠానికి తలవంపులు తెచ్చేలా ప్రవర్తించారు.

క్యాపిటల్ భవనంపై ఆయన మద్దతుదారులు దాడికి పాల్పడిన ఘటన యావత్తు ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ను శాశ్వతంగా రాజకీయాల నుంచి సాగనంపడానికి రంగం సిద్ధమవుతోంది. గడువుకు ముందే ఆయనను పదవి నుంచి తొలగించి ప్రక్రియ ప్రారంభమయ్యింది.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అభిశంసించేందుకు ప్రతినిధుల సభ సిద్ధంగా ఉందని స్పీకర్ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు.
తన పాలనలో చివరి రోజుల్లో ఆయనను పదవిలో కొనసాగించాలని అత్యధికులు భావించడంలేదని పేర్కొన్నారు.
రాజ్యాంగంలోని 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించే తీర్మానం సోమవారం నాడు సభ ముందుకు రానుందని ఆమె తెలిపారు.

ఈ చట్ట సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించేందుకు ప్రస్తుత ఉపాధ్యక్షుడు, సెనేట్ అధ్యక్షుడిగా ఉన్న మైక్‌పెన్స్ అంగీకరించకుంటే, అభిశంసన అధికరణ ద్వారా ఆయనను తొలగించే దిశగా చర్యలు చేపడతామని పెలోసీ స్పష్టం చేశారు.

అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ట్రంప్ అధ్యక్ష పదవికి అనర్హుడని, ఇంక ఎంతమాత్రం ఆయన అధికారంలో కొనసాగే అర్హతలేదని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా, 2019 డిసెంబరులోనే ప్రతినిధుల సభలో ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని డెమొక్రాట్లు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

డెమొక్రాట్లు ఆధిపత్యం కలిగిన ప్రతినిధుల సభలో ఈ తీర్మానం నెగ్గినా.. సెనెట్‌లో రిపబ్లికన్లకు మెజారిటీ ఉన్న కారణంగా అక్కడ ఆమోదం పొందలేదు.

ఎన్నికల్లో విజయం సాధించిన డెమొక్రాటిక్ నేత జో బైడెన్ గెలుపును ధ్రువీకరించడానికి అమెరికా కాంగ్రెస్ సమావేశం ఏర్పాటుచేయగా.. క్యాపిటల్ బిల్డింగ్‌పై ట్రంప్ మద్దతుదారులు దాడి చేశారు. ట్రంప్ స్వయంగా తన మద్దతుదారులను ఈ దాడికి ఉసిగొల్పారని కూడా వార్తలు వచ్చాయి.

అయితే, అభిశంసన చేయాలంటే అందుకు పెద్ద ప్రసహనం ఉంది. ప్రధానంగా ఇది రెండంచెల పద్ధతి.

మొదట ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి ఓటింగ్‌ చేస్తారు. అభిశంసన అనేది క్రిమినల్‌ కేసుతో సమానం.
సాధారణ మద్దతుతో ఈ తీర్మానం ఆమోదం పొందితే దాన్ని సెనేట్‌కు పంపిస్తారు. అక్కడ కూడా దీనిపై చర్చ జరుగుతుంది.
అభిశంసన మేనేజర్లను నియమించి వాదనలు వింటారు. అధ్యక్షుడికి తన వాదన వినిపించుకునే అవకాశం ఇస్తారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విచారణను పరిశీలిస్తారు. సెనేట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరం.