Home Blog Page 1385

#MeghaAkash : మేఘ బాధకు కారణం ఎవరు

0

Cloud is in trouble for something. Who is the cause of this suffering? Why did the cloud eyes blink? Is clear from watching the movie ‘Dear Megha’.

The title role of Megha Akash is the upcoming film ‘DearMegha’. Arjun Dasyan is producing in the lead roles of Arun Adit and Arjun Somayaju. Sushant Reddy is the director.

మేఘ ఏదో బాధలో ఉంది. ఈ బాధకు కారణం ఎవరు? మేఘ కళ్లు ఎందుకు చెమర్చాయి? అనేది ‘డియర్‌ మేఘ’ సినిమా చూస్తే తెలుస్తుంది.

మేఘా ఆకాశ్‌ టైటిల్‌ రోల్‌లో రూపొందుతున్న చిత్రం ‘డియర్‌ మేఘ’. అరుణ్‌ ఆదిత్, అర్జున్‌ సోమయాజుల ప్రధాన పాత్రల్లో అర్జున్‌ దాస్యన్‌ నిర్మిస్తున్నారు. సుశాంత్‌ రెడ్డి దర్శకుడు.

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రానా, గౌతమ్‌ వాసుదేవమీనన్, ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను విజయ్‌ సేతుపతి విడుదల చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు.

మోషన్‌ పోస్టర్‌లో మేఘ కన్నీరు పెట్టుకుంటూ, బాధలో ఉన్నట్లు కనబడుతుంది. ‘‘మా సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది.

త్వరలోనే విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: హరి గౌర, కెమెరా: ఐ ఆండ్రూ, ఎడిటర్‌: ప్రవీణ్‌ పూడి.

#KCR : ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త

0

Good news for Telangana RTC employees. Chief Minister KCR fulfilled the promise given to RTC employees during the movement.

The state government has formulated guidelines on job security for employees working in the Telangana State Road Transport Corporation.

CM KCR who examined these .. signed the guidelines on Thursday.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యమ సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించే అశంపై రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది.

వీటిని పరిశీలించిన సీఎం కేసీఆర్.. మార్గదర్శకాలపై గురువారం నాడు సంతకం చేశారు.

జీతాల పెంపు, ఉద్యోగ భద్రత సహా 26 డిమాండ్లతో 2019లో ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేసిన విషయం తెలిసిందే.

అయితే ఉద్యోగుల సమ్మె విరమణ అనంతరం సీఎం కేసీఆర్ ఆర్టీసీ ఉద్యోగులను పలువురిని ప్రగతి భవన్‌కు పిలిపించుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఆ సందర్భంగా ఉద్యోగ భద్రత సహా పలు అంశాలపై భరోసా ఇస్తూ హామీ ఇచ్చారు.

నాడు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఉద్యోగ భద్రతపై సంతకం చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల నియమావళి ఉల్లంఘపై ఏపీ సీఎం జగన్‌కు తెలంగాణ కోర్టు సమన్లు

0

The Public Representative Court in Nampally, Hyderabad has issued summons to Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy.

The court recently issued summons in a case filed against him for violating the code of conduct by holding a rally on National Highway-65 without permission as part of the 2014 election campaign.

హైదరాబాద్ నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి సమన్లు జారీ చేసింది.

2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ రహదారి-65పై అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ దాఖలైన కేసులో కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.

అప్పట్లో జగన్‌పై కోదాడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు చార్జ్‌షీట్ దాఖలు చేశారు.

ఈ కేసులో జగన్ ఏ1 నిందితుడు కాగా, ఏ2, ఏ3 నిందితులుగా ఉన్న వారిపై అక్కడి కోర్టు కేసులు కొట్టివేసింది.

ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న జగన్ ఇప్పటి వరకు విచారణకు హాజరు కాకపోవడంతో తాజాగా సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.

#TTD : తిరుమల శ్రీవారి హుండీకి మళ్లీ రికార్డ్ ఆదాయం

0
Tirumala visited by 46,928 people. Again several days later Srivari hundi income increased. Devotees will be taken 20,000 Sarvadarshan tokens daily at Alipiri.
స్వామివారిని 46,928 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మళ్లీ చాలా రోజుల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది. అలిపిరి వద్ద నిత్యం భక్తులకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు.
తిరుమల శ్రీవారికి మళ్లీ భారీ ఆదాయం వచ్చింది. గురువారం భక్తుల రద్దీ కొనసాగగా.. స్వామివారిని 46,928 మంది దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
21,159 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీకి రూ.3.15 కోట్లు ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది.
మళ్లీ చాలా రోజుల తర్వాత శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది. తిరుమలలో 11న పురంధరదాసు ఆరాధనోత్సవాలు.. 19న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.
అలిపిరి వద్ద నిత్యం భక్తులకు 20 వేల సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు.
కరోనా ప్రభావంతో స్వామివారి హుండీ ఆదాయం బాగా తగ్గిపోయింది.
కరోనా కట్టడి కావడంతో పాటూ పరిస్థితుల్లో మార్పు రావడంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది.. హుండీ ఆదాయం కూడా పెరుగుతోంది.
టీటీడీ కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. క్రమంగా భక్తుల సంఖ్యను పెంచుతోంది.
రూ.300 ప్రత్యేక దర్శనంతో పాటూ సర్వ దర్శనం టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో.. భక్తుల సంఖ్య పెరిగింది.

#KTR : ఫ‌లించిన కేటీఆర్‌‌ వ్యూహం

0

Municipal Minister K Tarakaramarao made the toll-free number available to the Asset Protection Department in August last year to crack down on occupiers and violators.

Citizens were also made partners in the conservation of public places.

కబ్జాదారులు, నిబంధనలు ఉల్లంఘించేవారి ఆట కట్టించడానికి పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు గత ఏడాది ఆగస్టులో ఆస్తుల రక్షణ విభాగానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో పౌరులను కూడా భాగస్వాములను చేశారు.

ఈ ప్రయోగానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజలిచ్చిన సమాచారం, అధికారుల చర్యల ఫలితంగా 18 ప్రదేశాల్లో కబ్జాలను గుర్తించి, ఆ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు.

ఆస్తుల రక్షణ విభాగానికి వచ్చిన ఫిర్యాదు/ సమాచారంపై తక్షణం రంగంలోకి దిగుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం) విభాగాలు.. కబ్జా కోరల్లో చిక్కుకున్న స్థలాలను కాపాడుతున్నాయి.

ఇప్పటివరకు నగరంలోని 18 ప్రధాన ప్రాంతాలలో కబ్జాకు గురైన, కోట్ల రూపాయల విలువైన 4.9 ఎకరాల మేర ఉన్న స్థలాలను జీహెచ్‌ఎంసీకి స్వాధీనం చేశాయి.

ఆ స్థలాల్లో కొన్నింటిలో పార్కులను అభివృద్ధి చేస్తున్నారు.

టోల్‌ఫ్రీ నంబర్‌ 1800-599-0099

#AP : 7న రాష్ట్రానికి రానున్న రాష్ట్ర‌ప‌తి

0

President RamnathKovind is scheduled to visit AP. He will tour Chittoor district on the 7th of this month.

Arrive Madanapalle at 12.10 pm on Sunday by AirForce Helicopter from Bangalore Airport.

The President will be welcomed by Governor VishwabhushanHarichandan and CM YS Jagan.

Afterwards, Kovind will reach Satsang Ashram by road from Madanapalle.

Participate in the stone laying ceremony at the Ashram and the launch of the Bharat Yoga Center Yoga Center.

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ నెల 7న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు.

బెంగళూరు విమానాశ్రయం నుంచి ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో ఆదివారం మధ్యాహ్నం 12.10 గంటలకు మదనపల్లె వస్తారు. రాష్ట్రపతికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌ స్వాగతం పలుకనున్నారు.

అనంతరం కోవింద్‌ మదనపల్లె నుంచి రోడ్డు మార్గాన సత్సంగ్‌ ఆశ్రమానికి చేరుకుంటారు. ఆశ్రమంలో జరిగే శంకుస్థాపన,

భారత్‌ యోగా విద్యా కేంద్ర యోగా కేంద్రం ప్రారంభం కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సత్సంగ్‌ విద్యాలయం, సదుం మండలంలోని పీపుల్స్‌గ్రోవ్‌ స్కూల్‌కు చేరుకుని పాఠశాల ఆవరణలో మొక్కలు నాటుతారు.

విద్యార్థులు, టీచర్లతో రాష్ట్రపతి ముఖాముఖిగా మాట్లాడతారు. సాయంత్రం 4.50 గంటలకు అక్కడి నుండి హెలికాప్టర్‌లో బెంగళూరుకు తిరుగు పయనం అవుతారు.

గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్రపతి కోవింద్‌తో కలసి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మదనపల్లె బీటీ కళాశాలలో రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం విజయవాడకు తిరుగు పయనం అవుతారు.

#REA : రైతుల నుంచి నేరుగా ధాన్యం కొంటాం

0

The Rice Exporters Association (REA) has come up with a new proposal that they will also buy grain directly from farmers.

This would provide farmers with a minimum support price, as well as transportation, storage and rice milling costs to governments.

The REA has sent proposals to the Central and State Governments in this regard.

‘There are three benefits to rice exporters buying grain from farmers at once. The crop grown by the farmer will definitely get MSP.

Purchasing for the government, saves other costs. Rice exports from one country to another are on the rise, ”the REA said.

రైతుల నుంచి తాము కూడా నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తామని రైస్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ (ఆర్‌ఈఏ) కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.

దీనిద్వారా రైతులకు కనీస మద్దతు ధర దక్కడంతోపాటు, అటు ప్రభుత్వాలకూ రవాణా, స్టోరేజీ, బియ్యం మిల్లింగ్‌ ఖర్చులు మిగులుతాయని పేర్కొన్నది.

ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్‌ఈఏ ప్రతిపాదనలు పంపించింది.

‘బియ్యం ఎగుమతిదారులు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం వల్ల ఒకేసారి మూడు ప్రయోజనాలు కలుగుతాయి.

రైతు పండించిన పంటకు కచ్చితంగా ఎంఎస్‌పీ దక్కుతుంది. ప్రభుత్వానికి కొనుగోలు, ఇతర ఖర్చులు ఆదా అవుతాయి.

దేశం నుంచి ఇతర దేశాలకు బియ్యం ఎగుమతులు పుంజుకుంటాయి’ అని ఆర్‌ఈఏ పేర్కొన్నది.

#AP : వ‌ద్దంటున్నా జోరుగా ఏక‌గ్రీవాలు

0

Attempts by the ruling YSR Congress Party to promote consensus in the panchayat elections in the state seem to be yielding some results.

Although all non-YSRCP political parties are opposed to the consensus, its impact at the field level has not been large.

The villagers seem to ignore the statements made by Nimmagadda Ramesh Kumar that they are not promoting consensus.

Consensus was reached at the end of the process of withdrawal of early polling nominations.

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు, వేస్తోన్న వ్యూహాలు కొంతమేర ఫలితం ఇస్తున్నట్టే కనిపిస్తోంది.

వైఎస్సార్సీపీయేతర రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తోన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో దాని ప్రభావం పెద్దగా పడట్లేదు.

ఏకగ్రీవాలను తాము ప్రోత్సహించట్లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తోన్న ప్రకటనలను గ్రామస్తులు పట్టించుకోనట్టే.

తొలిదశ పోలింగ్ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసేసరికి ఏకగ్రీవాలు తేలాయి.

తొలి విడత 453 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లా, అత్యల్పంగా అనంతపురం జిల్లాల్లో ఏకగ్రీవాలు నమోదు అయ్యాయి.

చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. అనంతపురంలో ఆరుచోట్ల స్థానికులు తమ సర్పంచ్‌ను పోటీ లేకుండా ఎన్నుకున్నారు.

చిత్తూరు జిల్లాలో తొలి విడత మొత్తం 454 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. ఇందులో 96 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 358 పంచాయతీలకు ఈ నెల 9వ తేదీన పోలింగ్ ఉంటుంది.

రాజధాని అమరావతి ప్రాంత పరిధిలోని గుంటూరు జిల్లాలో 67 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

తొలి విడత 337 పంచాయతీలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. 67 ఏకగ్రీవం అయ్యాయి. మూడు రాజధానులను నిరసిస్తూ 400 రోజులకు పైగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతోన్న ఈ జిల్లాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఏకగ్రీవాలు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో కడపలో 46, న్యాయ రాజధానిగా ఏర్పాటు కాబోతోన్న కర్నూలు జిల్లాలో 54 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

శ్రీకాకుళం జిల్లాలో 34 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. పశ్చిమగోదావరి-40, విశాఖపట్నం-32, తూర్పు గోదావరి-28, కృష్ణా జిల్లా-20, ప్రకాశం-16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.

అనంతపురంలో ఆరు పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయి. తొలి దశ ఎన్నికల్లో 1,323 నామినేషన్లను తిరస్కరించారు.

రెండో విడత పంచాయతీల నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది. రెండో దశలో 3,335 పంచాయతీలు, 33,632 వార్డులకు ఎన్నికలను నిర్వహిస్తారు.

రెండో విడత పోలింగ్ ఈ నెల 13న ఉంటుంది. అదే రోజు సాయంత్రం 4గంటలకు కౌంటింగ్ చేపడతారు. ఆ వెంటనే ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారు.

#India : ప్రమాదంలో జర్నలిజం.. ? ఎందుకు.. ?

0

“India is the largest democracy in the world. However, the government does not consider it necessary to comment on such fabrications, “said David Cook, chief of The Christian Science Monitor’s Washington bureau.

“భావ ప్రకటనా స్వేచ్ఛకు భరోసా ఇవ్వలేనప్పుడు ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు’’ అని 2014లో తాను ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ సందర్భంలోవ్యాఖ్యానించారు.

మోదీ పదవిని చేపట్టి ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి. దేశంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ కొరవడి, ప్రజాస్వామ్యం నిజంగానే ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోందని చాలామంది భావిస్తున్నారు .

180 దేశాలలో పరిస్థితులను పరిశీలించగా ‘వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్’‌లో భారత్‌కు 142వ స్థానం దక్కింది.

ఇది అంతకు ముందు సంవత్సరం కన్నా ఇంకా రెండు స్థానాలు తక్కువ.

‘రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ అనే సంస్థ ప్రతియేటా భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించి ఈ గణాంకాలను విడుదల చేస్తుంది.

ఆరోగ్యకరమైన మీడియా ఉందని చెప్పుకునే దేశానికి ఇది నిజంగా దారుణమైన ర్యాంకు అని చెప్పక తప్పదు.

భారతదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న రైతుల ఆందోళన సందర్భంగా జరిగిన హింస తర్వాత మీడియా స్వేచ్ఛకు మరింత ప్రమాదం ఏర్పడినట్లు కనిపిస్తోంది.

రైతుల ఆందోళనల్లో ఒక వ్యక్తి మరణించగా, 500మంది పోలీసులు గాయపడ్డారు.

ఈ ఘటనలపై పలువురి మీద పోలీసులు దేశద్రోహంతోపాటు వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇందులో 8మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు.

వీరంతా ఈ ఆందోళనలను కవర్‌ చేశారు.

నిరసనల సందర్భంగా ఒక రైతు ఎందుకు మరణించాడన్నది ఇంకా వివాదాస్పదంగానే ఉంది.

ట్రాక్టర్‌ తిరగబడటం వల్ల ఆ రైతు చనిపోయాడని అధికారులు చెబుతుండగా, పోలీసు కాల్పుల వల్లే మరణించాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ ఆరోపణలు వివిధ పత్రికల్లో, టీవీల్లో ప్రముఖంగా వచ్చాయి. అయితే ఈ వార్తను కొందరు జర్నలిస్టులు రిపోర్ట్ చేయడమో పబ్లిష్ చేయడమో చేశారు.

అయితే కొందరు దీన్ని కేవలం సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఇలా సోషల్ మీడియాలో ఈ వార్తను పోస్ట్‌ చేసిన వారిలో ఆరుగురు జర్నలిస్టులతోపాటు, ఒక కాంగ్రెస్‌ ఎంపీ కూడా ఉన్నారు.

వీరంతా ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాల నుంచి కేసులు ఎదుర్కొంటున్నారు. తప్పుడు సమాచారం ప్రచారం చేశారన్నది వీరిపై ఉన్న అభియోగం.

“ఒక మృతుడి కుటుంబ సభ్యులు పోస్ట్‌మార్టం రిపోర్టుపై అనుమానాలు వ్యక్తం చేయగా, దాని రిపోర్ట్‌ చేయడం నేరం అవుతుందా’’ అని ‘ది వైర్’ ఎడిటర్‌ ఇన్-చీఫ్‌ సిద్ధార్ధ వరదరాజన్ ప్రశ్నించారు.

‘ది వైర్’‌తోపాటు అందులో పనిచేసే ఒక జర్నలిస్టు పైనా కేసు నమోదైంది.

ఈ కేసులపై ఇండియావ్యాప్తంగా హక్కుల ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేశారు. “శాంతియుత ఆందోళనలు చేస్తున్నవారిని ప్రభుత్వం రెచ్చగొడుతోంది.

తనపై విమర్శలు చేసేవారిని, ఈ వార్తలను కవర్‌ చేసేవారిని కేసులతో అణచి వేయాలని చూస్తోంది” అని ‘హ్యూమన్‌ రైట్స్‌ వాచ్’ సౌత్ ఏషియా డైరక్టర్‌ మీనాక్షీ గంగూలీ అన్నారు.

పాత్రికేయులపై పెట్టిన కేసులు వారిని వేధించడానికి తప్ప మరొకటి కాదని ‘ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా’ ఆరోపించింది.

కేసులు ఎదుర్కొంటున్న వారి జాబితాలో ‘కారవాన్‌’ న్యూస్‌ మేగజైన్‌ తరచూ కనిపిస్తోంది. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తుందని ఈ పత్రికకు పేరుంది.

నిరసనకారుల్లో ఒక వ్యక్తి మరణించాడన్న వార్త విషయంలో ఈ మేగజైన్‌కు చెందిన ముగ్గురు సీనియర్‌ జర్నలిస్టులపై ఐదు రాష్ట్రాలలో కేసులు నమోదయ్యాయి.

ఇదే మేగజైన్‌కు సంబంధించిన ఓ ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును పోలీసులు ఆందోళనలు జరుగుతున్న ప్రాంతంలో అరెస్టు చేసి, రెండు రోజుల తర్వాత విడుదల చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన లీగల్‌ నోటీసుతో ఈ మేగజైన్‌కు చెందిన ట్విటర్‌ ఎకౌంట్‌ను కొన్ని గంటలపాటు సస్పెన్షన్ లో పెట్టారు.

గత ఏడాది దిల్లీ నగరంలో ఒక యువతి అత్యాచారం, హత్య కేసుకు సంబంధించిన నిరసన ప్రదర్శనల సమయంలో ‘కారవాన్‌’ మేగజైన్‌కు చెందిన నలుగురు జర్నలిస్టులపై దాడులు జరిగాయి.

“ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. ప్రజల తరఫున ప్రశ్నించడం జర్నలిస్టుల విధి” అని ‘కారవాన్‌’ పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ వినోద్ జోస్‌ అన్నారు.

అధికార పార్టీ ఏమంటోంది?

పాత్రికేయులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారన్న వాదనను అధికార బీజేపీ తిరస్కరించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారంలో ఇది ఒక భాగమని స్పష్టం చేసింది.

“వివిధ పార్టీలతో సంబంధం ఉండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులందరూ తమ తమ పత్రికలు, టీవీలు, వెబ్‌సైట్‌లలో స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పగలుగుతున్నారు’’ అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా అన్నారు.

నిరసనకారులను కుట్రపూరితంగా రెచ్చగొట్టే ప్రయత్నం జరిగినట్లు తేలినందువల్లే జర్నలిస్టులపై కేసులు నమోదయ్యాయని పాండా తెలిపారు.

తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు ఓ ప్రముఖ టీవీ ఛానల్‌ సీనియర్‌ ఎడిటర్‌ను కొన్నాళ్లు స్క్రీన్‌ మీద కనపడవద్దని యాజమాన్యం ఆదేశించిందని, అలాగే నెల రోజుల వేతనాన్ని కట్‌ చేసిందని పాండా ఈ సందర్భంగా గుర్తు చేశారు.

“ఇదేదో చిన్న తప్పిదం కాదు. ఒక భయంకరమైన విధ్వంసానికి కారణమయ్యే తప్పుడు ప్రచారం.

ఆ జర్నలిస్టు గతంలో కూడా ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తికి ప్రయత్నించారు. బాధితులు కోర్టు వెళ్లడంతో క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి’’ అని పాండా అన్నారు.

“మోదీని వ్యతిరేకించే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులపై లేని ప్రేమను నటిస్తున్నాయి.

ఇది అధికారాన్ని దుర్వినియోగం చేయడం తప్ప మరొకటి కాదు’’ అని పాండా అన్నారు.

అయితే ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, మైనారిటీలపై ద్వేషపూరిత వార్తలను ప్రచారం చేసే జర్నలిస్టులు ఇలాంటి కేసుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పించుకోగలుగుతున్నారని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే వలస పాలకుల కాలంనాటి దేశద్రోహం చట్టాలను ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారి మీద ప్రయోగించడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గత దశాబ్ధకాలంగా నమోదైన 405 దేశద్రోహం కేసుల్లో మెజారిటీ కేసులు 2014 తర్వాత, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నమోదైనవేనని ‘ఆర్టికల్ 14’ అనే వెబ్‌సైట్ రూపొందించిన ఒక నివేదిక వెల్లడించింది.

ప్రతిపక్ష నేతలు, విద్యార్ధులు, జర్నలిస్టులు, రచయితలు, మేధావులు ఈ చట్టానికి బాధితులుగా మారారని వెల్లడించింది.

ప్రభుత్వం హక్కులను కాపాడలేదా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో జర్నలిస్టులు గతంకన్నా ఎక్కువ విభజనకు గురయ్యారన్న భావన కనిపిస్తోంది. ప్రధాన మీడియాలో ఎక్కువ సంస్థలు మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయన్న అభిప్రాయం ఉంది.

“ఇండియా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. అయితే భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించడం తమ విధి కాదని ప్రభుత్వం భావిస్తోంది’’ అని ‘ఫ్రీడమ్‌ హౌస్’‌ విడుదల చేసిన ఓ రిపోర్ట్‌ పేర్కొంది.

జర్నలిస్టులు స్వేచ్ఛగా లేరని, 2020 సంవత్సరంలో 67మంది జర్నలిస్టులు అరెస్టయ్యారని, 200మందిపై దాడులు జరిగాయని ‘ఫ్రీస్పీచ్‌ కలెక్టివ్’‌ కోసం నిర్వహించిన ఓ స్టడీలో గీతాశేషు అభిప్రాయపడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ యువతిపై అత్యాచారం వార్తను కవర్‌ చేసిన జర్నలిస్టు ఒకరు 5 నెలలపాటు జైలులో ఉండాల్సి వచ్చింది.

ప్రభుత్వాన్ని విమర్శించే మహిళా జర్నలిస్టులను ఆన్‌లైన్‌లో అసభ్యకరమైన భాషలో ట్రోలింగ్‌ చేయడం, బెదిరించడం సర్వసాధరణమైంది.

“అత్యాచారం చేస్తామని, చంపుతామని నన్ను నేరుగా బెదిరించారు, ఆన్‌లైన్‌లో అభ్యంతరకర భాషలో ట్రోల్‌ చేశారు” అని దిల్లీకి చెందిన ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు నేహా దీక్షిత్‌ వెల్లడించారు.

కొందరు తన అపార్ట్‌మెంట్‌లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారని నేహా చెప్పారు.

రోహిణి సింగ్‌ అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్టును బెదిరించిన కేసులో పోలీసులు ఇటీవలే ఓ విద్యార్ధిని అరెస్టు చేశారు.

అప్రకటిత ఎమర్జెన్సీ

భావ ప్రకటనా స్వేచ్ఛను రక్షించే బలమైన చట్టాలు భారత్‌లో లేవని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వైస్‌డీన్‌ తరునాబ్‌ ఖేతాన్‌ అన్నారు.

భావ ప్రకటనా స్వేచ్ఛకు రాజ్యాంగం గ్యారంటీ ఇస్తున్నప్పటికీ 1951లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన తొలి సవరణలోనే దానికి పరిమితులు ఏర్పడ్డాయని ఆయన వివరించారు.

తొలి సవరణ నాటి నుంచి భారత ప్రభుత్వం “పౌరుల హక్కుల గురించి చెప్పడం వేరు, వాటిని రక్షించడం వేరు అన్న భావనలోకి వెళ్లింది ’’ అని ‘సిక్స్‌టీన్‌ స్టార్మీ డేస్‌’ అన్న పుస్తకంలో త్రిపుర్‌దమన్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.

“పౌర హక్కులను రక్షించడాన్ని ఒక బాధ్యతగాకన్నా ఒక అడ్డంకిగా ప్రభుత్వాలు చూస్తున్నాయి’’ అని ఖేతాన్‌ అన్నారు.

మిగతా ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే ప్రజల హక్కులను రక్షించడంలో సుప్రీంకోర్టు ట్రాక్‌ రికార్డు కూడా దారుణంగా ఉందని ఖేతాన్‌ అభిప్రాయపడ్డారు.

1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించడంతో 21 నెలలపాటు పత్రికా స్వేచ్ఛ అనేక నిర్బంధాలను ఎదుర్కొంది.

“ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే ఎమర్జెన్సీలాంటి నిర్బంధాలు లేకపోయినా, హక్కులను బహిరంగంగానే హరిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇది ఎక్కడా అధికారికంగా అణచివేత కనిపించదు. కానీ అంతర్లీనంగా సాగిపోతూ ఉంటుంది. ఒకరకంగా మనం అప్రకటిత ఎమర్జెన్సీలో ఉన్నాం’’ అని ఖేతాన్‌ వ్యాఖ్యానించారు.

“మరి కనిపించని ఈ ఎమర్జెన్సీని తొలగించడం ఎలా సాధ్యమవుతుంది’’ అని ఖేతాన్‌ అన్నారు.

#China : అబ్బాయిల్లో ‘మగతనం’ పెంచడానికి ప్రభుత్వం చర్యలు

0

దేశంలోని అబ్బాయిలు మరీ ‘అమ్మాయిల్లా’ తయారవుతున్నారంటూ చైనా విద్యాశాఖ జారీ చేసిన ఒక నోటీసు కలకలం సృష్టిస్తోంది.

చాలా మంది ఆన్‌లైన్ యూజర్లు ఈ నోటీసు మహిళలను కించపరిచేలా ఉందని ఆరోపిస్తే, మరికొందరు మాత్రం చైనా మేల్ సెలబ్రిటీలు దీనికి కొంత వరకు బాధ్యులని వాదించారు.

దేశంలో అత్యంత పాపులర్ అయిన మేల్ రోల్ మోడల్స్ ‘ఆర్మీ హీరోల్లా’ బలంగా క్రీడాకారుల్లా ఉండడం లేదని చైనా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.

ఫుట్‌బాల్ అభిమాని అయిన అధ్యక్షుడు జిన్‌పింగ్ కూడా తమ దేశంలో మెరుగైన స్పోర్ట్స్ స్టార్లను తయారు చేయాలని చాలాకాలం నుంచీ ప్రయత్నిస్తున్నారు.

దీంతో, చైనా విద్యా శాఖ తమ అంతిమ లక్ష్యం గురించి గత వారం ఒక నోటీస్ జారీ చేసింది.

కౌమారదశలో ఉన్న అబ్బాయిలు మరీ ‘అమ్మాయిల్లా’ తయారవకుండా స్కూళ్లలో వారికి అందించే శారీరక శిక్షణను పూర్తిగా సంస్కరించాలని, ఉపాధ్యాయుల నియామకాలను బలోపేతం చేయాలని ప్రతిపాదించింది.

రిటైర్ అయిన క్రీడాకారులను, క్రీడా నేపథ్యం ఉన్న వారిని కూడా రిక్రూట్ చేసుకోవాలని ఈ నోటీసులో సలహా ఇచ్చారు. విద్యార్థుల్లో ‘మగతనం’ పెంచే ఉద్దేశంతో క్రీడలను, ముఖ్యంగా ఫుట్‌బాల్ లాంటి క్రీడల్లో కఠిన శిక్షణ ఇవ్వాలని సూచించారు.

సున్నితంగా, నాజూకుగా కనిపించే, ‘సామాజిక బాధ్యత’ కలిగిన మేల్ స్టార్లను తప్ప వేరే ఎవరినీ తెరపైకి అనుమతించని మీడియా ఉన్న దేశంలో దీనిని ఒక నిర్ణయాత్మక చర్యగా భావిస్తున్నారు.

కానీ, ఇలాంటి చర్యల తీసుకోబోతున్నట్లు చైనా ఇంతకు ముందే సంకేతాలు ఇచ్చింది.

చైనా యువకుల్లో చాలామంది, బలహీనంగా, పిరికిగా ఉంటున్నారని ఆ దేశ అత్యున్నత సలహా మండలి ప్రతినిధి సీ జెఫూ అన్నారు.

“చైనాలోని యువకుల్లో అమ్మాయిల్లా సుకుమారంగా ఉండే ఒక ట్రెండ్ పెరుగుతోంది. దానిని సమర్థంగా ఎదుర్కోకపోతే చైనా మనుగడ, అభివృద్ధే ప్రమాదంలో పడిపోతుంది. దీనికి కొంత వరకూ ఇంట్లో పెరిగే వాతావరణం కూడా కారణం. చైనా అబ్బాయిలను ఎక్కువగా వాళ్ల తల్లులు, బామ్మలే పెంచుతున్నారు” అని సీ జెఫూ అన్నారు.

దేశంలోని కొంతమంది మేల్ సెలబ్రిటీలను చూసి, కొంతమంది అబ్బాయిలు అసలు ‘ఆర్మీ హీరోలు’ కావాలని కోరుకోవడం లేదని, అందుకే, యువకులకు సమతుల విద్యను అందించడంలో స్కూళ్లు కీలక పాత్ర పోషించాలని ఆయన సూచించారు.

మగాళ్లు ఎందుకు భయపడుతున్నారు

చైనా విద్యా శాఖ నోటీసుపై చాలా మంది చైనీయులు ప్రతికూలంగా స్పందించారు.

కొన్ని లక్షల మంది చైనీయులు సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా మంది ప్రభుత్వం చెబుతున్నది లింగ వివక్షను ప్రోత్సహించేలా ఉందన్నారు.

“సున్నితంగా ఉండడం, ఒక అవమానకరమైన విషయమా” అని ఒక వీబో యూజర్ అడిగాడు. ఆయన కామెంటుకు 2 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.

“అబ్బాయిలు కూడా మనుషులే. భావోద్వేగాలు, బలహీనంగా లేక సున్నితంగా ఉండడం అనేవి మనిషి లక్షణాలు” అని మరో యూజర్ అన్నారు.

“మగవాళ్లు దేనికి భయపడతారు, మహిళలా సమానంగా ఉండడానికా?” అని ఇంకొకరు ప్రశ్నించారు.

దేశంలో మహిళల కంటే ఎక్కువగా 7 కోట్ల మంది మగాళ్లు ఉన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇలాంటి వికృతమైన లైంగిక నిష్పత్తి లేదు. ఇంత ‘మగతనం’ సరిపోదా అని మరో యూజర్ అన్నాడు.

“ఈ ప్రతిపాదనలేవీ మహిళల నుంచి రాలేదు. చైనా అగ్ర నాయకత్వంలో పురుషాధిపత్యం గణనీయంగా ఉందనే విషయాన్ని ఇంతకు ముందే చాలా మంది రాశారు” అని మరొకరు కామెంట్ చేశారు.

కొన్ని మీడియా సంస్థలు మాత్రం ప్రభుత్వ చర్యలకు సానుకూలంగా స్పందించాయి. గ్లోబల్ టైమ్స్ వార్తా పత్రిక ఇది కొంతమంది మద్దతు గెలుచుకుందని రాసింది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సీనో వీబోలో మేల్ సెలబ్రిటీలను నిందిస్తూ కొందరు కామెంట్లు పెట్టారు. ఈ సెలబ్రిటీలను ఎక్కువగా ‘లిటిల్ ఫ్రెష్ మీట్స్’ అని వర్ణిస్తుంటారు.

చైనాలోని కొందరు మేల్ యూత్ ఐకాన్లను ఉద్దేశిస్తూ ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఈ పదం ఉపయోగిస్తున్నారు. వీళ్లంతా నాజూకుగా, ఆకట్టుకునేలా, చాలా సుకుమారంగా కనిపిస్తుంటారు.

టీఎఫ్ బాయ్స్ అనే అబ్బాయిల బ్యాండ్, చైనా గాయకుడు లూ హాన్ ఇంకా చాలామంది ఈ కేటగిరీలోకి వస్తారు. మరోవైపు యావ్ మింగ్ లాంటి చైనా బాస్కెట్ బాల్ ఆటగాళ్లు అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించారు.

అయితే ప్రభుత్వం తమ ప్రతిపాదనల్లో ముఖ్యంగా ఫుట్‌బాల్ శిక్షణ గురించే చెప్పింది.

ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. 2050 నాటికి చైనా వరల్డ్ ఫుట్‌బాల్ సూపర్ పవర్ అవుతుందని ఆశిస్తున్నట్లు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇంతకు ముందే చెప్పారు.

కానీ, ఫుట్‌బాల్‌లో రాణించాలని చైనా పదే పదే చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అది అసాధ్యమైన లక్ష్యంగా కనిపిస్తోందనే ఎగతాళి కూడా మొదలైంది.

రెండేళ్ల క్రితం చైనా నేషనల్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌ మార్సెల్లో లిప్పీ రిజైన్ చేసినపుడు ఇలాంటి స్పందనలు వచ్చాయి. లిప్పీ 2006 ఫిఫా వరల్డ్ కప్‌ గెలుచుకున్న ఇటలీని లీడ్ చేశారు.

మరోవైపు, దేశంలోని యువకులకు కొత్త రోల్ మోడల్స్‌ను పరిచయం చేయాలని, ప్రమోట్ చేయాలని చైనా కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది.

ఇక చైనాలోని మహిళల విషయానికి వస్తే, కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా మహిళలు గణనీయమైన పాత్ర పోషించారు.

గత ఏడాది చైనా సాధించిన అంతరిక్ష విజయాలు 24 ఏళ్ల స్పేస్ కమాండర్ ఝో చెంగ్యూ లాంటి వారి పేరు వైరల్ అయ్యేలా చేశాయి.

కానీ, చైనా యువకుల్లో సైనికులు, పోలీసులు, ఫైర్ ఫైటర్స్‌ కావాలనే ఆసక్తి తగ్గిపోతోందని సీ జెఫూ గత ఏడాది అన్నారు.

దేశంలో ‘లిటిల్ ఫ్రెష్ మీట్స్’ ట్రెండ్ విజయవంతంగా కొనసాగుతోందని నిరూపితమైంది. కానీ మేల్ యూత్ సెలబ్రిటీలు చాలా నిశిత పరిశీలనలో ఉన్నారు.

ఇటీవల కొంత కాలంగా టాటూలు, ఇయర్ రింగ్స్ వేసుకున్న మేల్ యూత్ ఐకాన్లను స్క్రీన్ మీద చూపించడానికి చైనా మీడియా కూడా ఇబ్బంది పడుతోంది.

చైనా టాప్ పాప్ స్టార్స్‌లో ఒకరు 2019లో బయట సిగరెట్ తాగుతూ కనిపించడంపై కూడా ఆన్‌లైన్లో తీవ్ర విమర్శలు వచ్చాయి.

There is a growing trend among young people in China to be as gentle as girls. China’s survival and development will be in danger if it is not tackled effectively. This is partly due to the growing environment at home. Chinese boys are mostly raised by their mothers and grandmothers