నైజీరియా: పొలంలో పనిచేస్తున్న 110 మంది వ్యవసాయ కూలీలను నైజీరియాలో ఉగ్రవాదులు అతి దారుణంగా చంపారు.
వారిని పొలంలో నుంచి తీసుకెళ్లి చేతులు కట్టేసి, గొంతులు కోసి హత్య చేశారు.
ఈశాన్య నైజీరియాలోని మైదుగురి నగరానికి సమీపంలో కోషోబ్ అనే గ్రామంలో శనివారం ఈ ఘాతుకానికి పాల్పడ్డారు ముష్కరులు.
‘బోకో హరమ్’ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారని నైజీరియాలో ఐక్యరాజ్య సమితి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎడ్వర్డ్ కల్లోన్ తెలిపారు.
ఈ ఏడాది పౌరులపై జరిగిన మారణకాండలో ఇదే అతి భయానకమని ఆయన పేర్కొన్నారు.