Homeఫ్లాష్ ఫ్లాష్డ్రగ్స్ కేసుః త‌న‌పై ప్ర‌చారాల‌ను ఆపాలంటూ హైకోర్టుకు రకుల్

డ్రగ్స్ కేసుః త‌న‌పై ప్ర‌చారాల‌ను ఆపాలంటూ హైకోర్టుకు రకుల్

హైద‌రాబాద్ః బాలీవుడ్ డ్రగ్స్ కేసులో మీడియాలో తనపై వస్తున్న ప్రచారాలను ఆపాలంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై వచ్చే ప్రసారాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని రకుల్ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించింది. దానిపై స్పందించిన హైకోర్టు.. రకుల్ ప్రీత్ చేసిన విజ్ఞప్తిపై కేంద్రం తన వైఖరిని తెలపాలని కోరింది. రకుల్ అభ్యర్ధనపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రం, ప్రసార భారతి, ప్రెస్ కౌన్సిల్‌ను హైకోర్టు ఆదేశించింది.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి, డ్రగ్స్ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి… నార్కొటిక్ అధికారుల విచారణలో రకుల్ ప్రీత్ సింగ్ పేరు చెప్పింద‌ని, అంద‌రూ క‌లిసి డ్ర‌గ్స్ తీసుకునే వారని, ర‌కుల్‌కు త్వ‌ర‌లోనే నోటీసులు కూడా అంద‌జేయ‌నున్న‌ట్లు మీడియా, సోష‌ల్ మీడియాలో వార్తలు రావ‌డం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img