మార్చి 29న ఎన్నో అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన క్రేజీ చిత్రం ‘టిల్లు స్క్వేర్’. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించాడు.
ఈ సినిమా మొదటి రోజు భారీ కలెక్షన్లు రాబట్టింది. సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియర్ షోస్ ద్వారా పెద్ద ఎత్తున కలెక్షన్లు వస్తున్నాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.23.7 కోట్లు గ్రాస్ కలెక్షన్ కొల్లగొట్టింది. తెలుగు రాష్ట్రాలలో రూ.11.5 కోట్లు కలెక్ట్ చేయగా, కర్ణాటకలో రూ.1కోటిగా పైగా, మిగతా చోట్ల రూ.20 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్ వచ్చినట్లు సమాచారం.