Homeహైదరాబాద్latest NewsBREAKING: బస్సు లోయలో పడి 10 మంది మృతి

BREAKING: బస్సు లోయలో పడి 10 మంది మృతి

పాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడి 10 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు 30 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్-పల్టిస్థాన్‌కు వెళ్తోంది. మార్గమధ్యంలో దియామర్ జిల్లాలోని కారకోరం హైవే వద్దకు రాగానే అదుపు తప్పి లోయలో పడిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent

- Advertisment -spot_img