Homeహైదరాబాద్latest NewsBREAKING: మెగా ఇంట్లో అల్లు బాంబ్.. ఏం జరిగిందంటే?

BREAKING: మెగా ఇంట్లో అల్లు బాంబ్.. ఏం జరిగిందంటే?

ఏపీలో ఎన్నికలు ముగిసాయి. ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా మారింది. కానీ చిత్రసీమ మాత్రం హాట్‌హాట్‌గా మారింది. కారణం అల్లు అర్జున్. ఆయన తన మిత్రుడు, వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు ప్రకటించడం మనకు తెలిసిందే. నంద్యాలలో ల్యాండైన మరుక్షణం నుంచి అల్లు అర్జున్‌పై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఎవరి పేరుతో బన్నీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. మెగా ఫ్యామిలీ వల్ల హీరోగా స్టార్‌డం సంపాదించి ఇప్పుడు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటంటూ మెగాభిమానులు మండిపడుతున్నారు. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ధీటుగానే బదులిస్తున్నారు. మెగా హీరోలందరిలోకి స్టైలీష్‌గా ఉండటం వల్లే బన్నీ ఐకాన్‌స్టార్‌గా ఎదిగాడంటూ వారు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వివాదం మధ్యలోకి మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీతో పరిస్ధితి పూర్తిగా అదుపు తప్పింది.

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన రోజు రాత్రి నాగబాబు ఓ ట్వీట్ వేశారు. ” మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే ” అంటూ ఆయన పోస్ట్ పెట్టాడు. ఇది పరోక్షంగా అల్లు అర్జున్‌ని ఉద్దేశించినదేనంటూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్వతహాగానే నాగబాబుకు తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం. వారిపై ఈగ వాలినా ఊరుకోరు. చిరు, పవన్‌లపై ఏ విమర్శ వచ్చినా .. ముందు నిలిచేది, వెంటనే స్పందించేది నాగబాబే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పరిణామాలు మెగా క్యాంప్‌లో విభేదాలను మరోసారి బయటకు తెచ్చాయంటున్నారు నెటిజన్లు.

బన్నీ చెప్పను బ్రదర్ కామెంట్స్, రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి గీతా బ్యానర్‌లో సినిమాలు చేయకపోవడం, అల్లు స్టూడియో, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ తదితర పరిణామాలు.. మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరు అనే సంకేతాలు జనంలోకి పంపాయి. శిల్పా రవి తనకు మిత్రుడు కావడం వల్లే నంద్యాల వెళ్లానని.. నా అనుకున్న వాళ్లు ఎక్కడ వున్నా వారి మేలు కోరుకుంటానంటూ బన్నీ తన టూర్‌పై క్లారిటీ ఇచ్చారు. కానీ నాగబాబు మాత్రం తాను చేసిన ట్వీట్‌పై స్పందించలేదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాగబాబు ట్వీట్ కారణంగా మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వివాదానికి దారితీసింది. ఇరు వర్గాలు ట్రోలింగ్స్, విమర్శలకు దిగాయి.

Recent

- Advertisment -spot_img