ఉత్తరప్రదేశ్ ఓటర్లు ఈ సారి గట్టి సర్ప్రైజ్ ఇచ్చేలా ఉన్నారు. యూపీని తమ కంచుకోటగా భావించిన బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్ని బట్టి చూస్తే…34 చోట్ల NDA కూటమి లీడ్లో ఉండగా…అటు ఇండీ కూటమి 45 చోట్ల దూసుకుపోతోంది. ఈ లెక్కలు ఎవరూ ఊహించలేదు. యోగి ఆదిత్యనాథ్ ఇలాకాలో బీజేపీకి ఇంత తక్కువ చోట్ల ఆధిక్యం రావడంపై గట్టి చర్చే జరుగుతోంది. సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ యూపీలో గట్టిగానే ప్రభావం చూపించినట్టు ప్రస్తుత ట్రెండ్ని బట్టి తెలుస్తోంది.