బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మెదక్లో ఇటీవల జరిగిన గోవధ విషయంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని ముందస్తు చర్యలు చేపట్టారు. గోవధను వ్యతిరేకిస్తూ తాను మెదక్కు వెళ్తానని ప్రకటించడంతో ముంబై నుంచి హైదరాబాద్కు చేరుకోగానే అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.