నీట్ ప్రశ్నపత్రం లీకేజ్కు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్వీ ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ లోని రాజ్భవన్ ముట్టడికి పిలుపునివ్వడంతో కార్యకర్తలు అక్కడికిి చేరుకుని ఆందోళన చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకుని పోలీస్స్టేషన్కు తరలించారు.