టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మేనిఫెస్టో విడుదలైంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ కీలక నేతలు కలిసి మంగళవారం మేనిఫెస్టోను ప్రకటించారు. ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలతో ప్రజల్లోకి వెళుతున్న ఎన్డీఏ కూటమి మరికొన్ని హామీలతో ఈ మేనిఫెస్టోను తయారు చేసింది. పలు కీలకమైన హామీలతో టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి మేనిఫెస్టో 2024ను రూపొందించారు.
- మెగా డీఎస్సీపై మొదటి సంతకం
- సామాజిక పింఛన్లు రూ.4 వేలకు పెంపు (2024 ఏప్రిల్ నుంచే వర్తింపు)
- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం
- మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- దివ్యాంగులకు పింఛను రూ.6 వేలకు పెంపు
- బీసీలకు 50 ఏళ్లకే పింఛను
- 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500
- యువతకు ఏటా 4 లక్షల చొప్పున ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు
- నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి
- తల్లికి వందనం కింద చదువుకుంటున్న పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15 వేలు
- రైతులకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం
- వాలంటీర్ల గౌరవవేతనం రూ.10 వేలకు పెంపు
- ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్ల ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం
- ఇసుక ఉచితం.. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
- ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్.. స్వచ్ఛమైన తాగునీటి సరఫరా
- భూ హక్కు చట్టం రద్దు.. కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ
- చేనేత కార్మికులకు మగ్గం ఉంటే 200.. మర మగ్గాలుంటే 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్
- పెళ్లి కానుక కింద రూ.లక్ష అందజేత.. విదేశీ విద్య పథకం పునరుద్ధరణ
- పండుగ కానుకలు మళ్లీ ప్రారంభం.. నాణ్యతలేని మద్యాన్ని అరికట్టి, ధరల నియంత్రణ
- ఆక్వారైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాల పునరుద్ధరణ
- చేనేతలకు ప్రత్యేక విధానాలు, పథకాలు
- నాయీ బ్రాహ్మాణులకు నెలకు రూ.25వేలు గౌరవేతనం.. అలాగే వారి షాపులకు 200 యూనిట్ల వరకు ఉచితం
- మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20వేలు ఆర్థిక సాయం.. 217 జీవో రద్దుకు హామీ.. బోట్ల మరమ్మతులకు ఆర్థిక సాయం
- స్వర్ణకారులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటాం
- డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
- చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు