నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వస్తున్న వేళ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రూ.30 లక్షలు తీసుకొని ఒక రోజు ముందే నీట్ ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసినట్టు అమిత్ ఆనంద్ ఒప్పుకున్నాడు. దానాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో జేఈ సికందర్తో కలిసి రూ.30 లక్షలు తీసుకొని ప్రశ్నాపత్రంతో పాటు సమాధానాలను నలుగురికి ఇచ్చినట్టు పోలీసుల అంగీకార పత్రంలో అమిత్ ఆనంద్ వెల్లడించాడు. నిందితుడి ఫ్లాట్లో కాలిపోయిన జవాబుపత్ర అవశేషాలను పోలీసులు గుర్తించారు.