Telangana Bahavan : ఈ నెల 18 న తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం ఏర్పాటు చేసే యోచనలో బీఆర్ఎస్ ఉంది. ఈ నేపథ్యంలోనే పార్టీ తరఫున పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఖర్చు కోసం రూ.95 లక్షల చెక్కును కేసీఆర్ ఇవ్వనున్నారు.