– కండువా కప్పి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
– పాత, కొత్త నేతలతో కలిసి పనిచేయాలని సూచన
– ఫేక్ సర్వేలతో రేవంత్ టికెట్లు ఇస్తున్నారని నాగం జనార్ధన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి ఆరోపణ
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. మంగళవారం కాంగ్రెస్ అసంతృప్త నేతలు మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి, నాగర్కర్నూల్ సీనియర్ నేత నాగం జనార్ధన్రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ వారికి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నాగం జనార్ధన్రెడ్డిని, విష్ణువర్ధన్రెడ్డిని హృదయపూర్వకంగా బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. నాగం జనార్ధన్రెడ్డికి తెలంగాణ ఉద్యమంలో ఎంతో చరిత్ర ఉందన్నారు. ఈ సారి పాలమూరు జిల్లాలో 14కు 14 సీట్లు గెలవాలన్నారు. జూబ్లీహిల్స్లో పాత, కొత్త నేతలు కలిసి పనిచేయాలన్నారు. నాగం కాంగ్రెస్ నుంచి నాగర్కర్నూల్ టికెట్ ఆశించారు. రెండో జాబితాలో తనకు టికెట్ దక్కకపోవడంతో రేవంత్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఫేక్ సర్వేలతో రేవంత్ టికెట్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల కాంగ్రెస్కు రాజీనామా చేశారు. దీంతో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు నాగం ఇంటికెళ్లి బీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానించారు. అనంతరం తాను బీఆర్ఎస్లో చేరుతానని చెప్పిన నాగం మంగళవారం సీఎం కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. జూబ్లీహిల్స్లో కీలక నేత దివంగత పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్రెడ్డి టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంత్రి హరీశ్రావు విష్ణువర్ధన్ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్లోకి రావాలని ఆహ్వానించడంతో ఆయన కూడా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.