Homeహైదరాబాద్latest Newsతహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన బీఆర్ఎస్ శ్రేణులు

ఇదే నిజం, ధర్మపురి/ ఎండపల్లి: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ఎండపల్లి మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ఎండపల్లి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు 500 రూపాయల బోనస్ ప్రకటించడం జరిగింది కానీ మన రైతాంగం అంతా దొడ్డు వడ్లనే పండిస్తారు కాబట్టి దొడ్డు రకం వడ్లకు కూడా క్వింటాలుకు 500 రూపాయలు బోనసును వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేస్తూ.. నిరసన వ్యక్తం చేస్తూ ఎండపల్లి తహసిల్దార్ కు వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఎండపల్లి మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సింహాచలం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజారాంపల్లి ఎంపీటీసీ గాజుల మల్లేశం కో -ఆప్షన్ సభ్యులు ఎండి రియాజ్ ఏలేటి చంద్రారెడ్డి మేకల రాజేశం పడదం నారాయణ మాజీ సర్పంచులు ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ నాయకులు మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img