సికింద్రాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని బాయ్ బస్తీలో ఇద్దరి వ్యక్తుల మధ్య మటన్ విషయంలో గొడవ జరగగా అది హత్యకు దారితీసింది. వివరాల ప్రకారం.. చారి, అజయ్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య మటన్ తినే విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో అజయ్ కత్తితో చారిపై దాడిచేశాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన చారి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందుతుడ్ని అదుపులోకి తీసుకన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
![](https://idenijam.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-15-at-17.02.10.jpeg)
![](https://idenijam.com/wp-content/uploads/2024/01/WhatsApp-Image-2024-01-15-at-17.02.10.jpeg)